విధాత‌: రిక్షా కార్మికుడికి ఐటీ శాఖ నోటీసు జారీచేసింది. రూ.3 కోట్లు చెల్లించాలంటూ నోటీసుల్లో పేర్కొంది. ఈ నోటీసును చూసిన రిక్షా కార్మికుడు దిమ్మతిరిగే షాక్ తగిలింది. దీంతో పోలీసులు ఆశ్రయించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో జరిగింది.మధుర జిల్లాలోని బకాల్‌పూర్‌కు చెందిన ప్రతాప్‌ సింగ్‌ ఓ రిక్షా కార్మికుడు. బ్యాంక్‌ అధికారులు పాన్‌ కార్డును అకౌంట్‌కు అనుసంధానించాలని చెప్పారు. దీంతో ఈ యేడాది 15న బకాల్‌పూర్‌లోని జన్‌ సువిధ కేంద్రంలో పాన్‌ కార్డు కోసం […]

విధాత‌: రిక్షా కార్మికుడికి ఐటీ శాఖ నోటీసు జారీచేసింది. రూ.3 కోట్లు చెల్లించాలంటూ నోటీసుల్లో పేర్కొంది. ఈ నోటీసును చూసిన రిక్షా కార్మికుడు దిమ్మతిరిగే షాక్ తగిలింది. దీంతో పోలీసులు ఆశ్రయించాడు.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో జరిగింది.మధుర జిల్లాలోని బకాల్‌పూర్‌కు చెందిన ప్రతాప్‌ సింగ్‌ ఓ రిక్షా కార్మికుడు. బ్యాంక్‌ అధికారులు పాన్‌ కార్డును అకౌంట్‌కు అనుసంధానించాలని చెప్పారు. దీంతో ఈ యేడాది 15న బకాల్‌పూర్‌లోని జన్‌ సువిధ కేంద్రంలో పాన్‌ కార్డు కోసం అప్లయ్‌ చేశాడు.

కొన్ని రోజులకు సంజయ్‌ సింగ్‌ అనే వ్యక్తి పాన్‌కార్డు కలర్‌ కాపీని ప్రతాప్‌ సింగ్‌కు ఇచ్చాడు. అయితే నిరక్షరాస్యుడైన ప్రకాశ్‌ సింగ్‌ అసలు కార్డుకు, కలర్‌ కాపీకి తేడా గుర్తించలేకపోయారు.కాగా, ఈ నెల 19న రూ.3,47,54,896 చెల్లించాలని ఐటీ అధికారులు ప్రకాశ్‌ సింగ్‌కు నోటీసులు జారీ చేశారు. తన జీఎస్టీ నంబర్‌తో 2018-19లో రూ.43,44,36,201 మేర వ్యాపారం చేసినందుకు గాను ఈ మొత్తాన్ని చెల్లించాలని అందులో పేర్కొన్నారు.

అయితే తాను రిక్షా కార్మికుడినని చెప్పడంతో తన పాన్‌ కార్డును మరెవరో దుర్వినియోగం చేశారని ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఐటీ అధికారులకు సలహా ఇచ్చారు. దీంతో ప్రతాప్‌ సింగ్‌ మధుర పోలీసులో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Updated On 26 Oct 2021 4:29 AM GMT
subbareddy

subbareddy

Next Story