ఈ ఆర్థికంలో చెల్లించాల్సిన చమురు బాండ్ల మొత్తం రూ.10,000 కోట్లేవిధాత,న్యూ ఢిల్లీ : పెట్రోలియం ఉత్పత్తులపై విధించే ఎక్సైజ్‌ సుంకం రూపంలో కేంద్రప్రభుత్వ ఖజానాకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జులైలో రూ.1 లక్ష కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో వచ్చిన రూ.67,895 కోట్ల ఆదాయంతో పోలిస్తే ఇది 48 శాతం ఎక్కువ. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తంమీద చమురు బాండ్లకు చెల్లించాల్సిన […]

ఈ ఆర్థికంలో చెల్లించాల్సిన చమురు బాండ్ల మొత్తం రూ.10,000 కోట్లే
విధాత,న్యూ ఢిల్లీ : పెట్రోలియం ఉత్పత్తులపై విధించే ఎక్సైజ్‌ సుంకం రూపంలో కేంద్రప్రభుత్వ ఖజానాకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జులైలో రూ.1 లక్ష కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో వచ్చిన రూ.67,895 కోట్ల ఆదాయంతో పోలిస్తే ఇది 48 శాతం ఎక్కువ. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తంమీద చమురు బాండ్లకు చెల్లించాల్సిన బకాయిలు రూ.10,000 కోట్లే కావడం గమనార్హం. అంటే ఈసారి అదనంగా వసూలైన రూ.32,492 కోట్లు కూడా చెల్లించాల్సిన మొత్తానికి 3 రెట్లకు మించి అధికమే. ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుండటంతో పెట్రో వినియోగం పెరిగి గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2021-22లో అదనంగా రూ.1 లక్ష కోట్ల ఆదాయం ఎక్సైజ్‌ రూపేణ ఖజానాకు చేరే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


రూ.1.34 లక్షల కోట్ల చమురు బాండ్లు: యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు రూ.1.34 లక్షల కోట్ల విలువైన చమురు బాండ్లను జారీ చేశారు.అందులో రూ.3,500 కోట్ల అసలును మాత్రమే యూపీఐ ప్రభుత్వం చెల్లించిందని, నరేంద్రమోదీ ప్రభుత్వం రూ.1.3 లక్షల కోట్ల అసలుకు వడ్డీ కలిపి చెల్లించాల్సి ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గత నెలలో చెప్పారు. ఈ మొత్తాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. 2021-22 లో రూ.10,000 కోట్లు, 2023-24లో రూ.31,150 కోట్లు, 2024-25లో రూ.52,860.17 కోట్లు, 2025-26లో రూ.36,913 కోట్లు చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Updated On 6 Sep 2021 12:59 PM GMT
Venkat

Venkat

Next Story