విధాత, హైదరాబాద్: దివంగత పీజేఆర్ కుమార్తె, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి సొంత గూటికి చేరుకున్నారు గురువారం గాంధీ భవన్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ నగరంలో ఎన్నో బస్తీలు పీజేఆర్తో వెలిశాయన్నారు. ప్రజల కోసం సొంత పార్టీని కూడా నిలదీయడానికి పీజేఆర్ వెనుకాడలేదని, చివరి శ్వాసవరకు పీజేఆర్ పేదల కోసం పని చేశారని కొనియాడారు.
పీజేఆర్ పోరాటం వల్లనే కృష్ణాలో వాటా దక్కిందన్నారు. జంట నగరాలకు కృష్ణా నీళ్ల కోసం ఆయన పోరాటం చేశారని, కొందరు తమ ఘనతగా ఇప్పుడు గొప్పలు చెప్పుకొంటున్నారని అన్నారు. నగరంలో పేదోళ్లకు ఇళ్లు, ఇళ్ల పట్టాలు ఇప్పించారన్నారు. పీజేఆర్ లేని లోటు తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
కాంగ్రెస్ బహిష్కరించినా ఆయన కాంగ్రెస్ జెండా వీడలేదన్నారు. పీజేఆర్ పెంచి పోషించిన వారే ఇప్పుడు నగరంలో ఎమ్మెల్యేలు అయ్యారన్నారు. నగరంలో నేడు మహిళలకు, పేదలకు రక్షణ లేదని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
బస్తీ ప్రజల పక్షాన పోరాడటం కోసం నాయకత్వం అవసరమన్నారు. అందుకోసమే విజయారెడ్డి కాంగ్రెస్లో చేరారన్నారు. హైదరాబాద్ పేద ప్రజల పక్షాన పోరాడే దళపతి దొరికిందని, విజయారెడ్డికి మంచి గౌరవం దక్కుతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
విజయారెడ్డి మాట్లాడుతూ ఖైరతబాద్ నియోజక వర్గ ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు. తాను పార్టీ మారడం ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదన్నారు. దేశంలో, రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఘటనలు తనను బాధించాయన్నారు. షీ టీమ్లు పెట్టామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్నా.. మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పెన్షన్, రేషన్ కార్డుల కోసం పేదలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారని, రాష్ట్ర ప్రజల బాగోగులను కేసీఆర్ ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ మాత్రమే పేదలకు న్యాయం చేస్తుందని ఆమె అన్నారు. సోనియా, రాహుల్ గాంధీ నాయకత్వంలో పని చేయడానికి వచ్చానన్నారు.
తాను పదవుల కోసం పార్టీ మారలేదని, ఇక మూడు రంగుల జెండా వదలనని, తనదిక ఒకటే జెండా.. ఒకటే బాటని విజయారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అంజన్కుమార్ యాదవ్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
I wholeheartedly welcome Khairatabad corporator, daughter of our beloved leader PJR…Smt. P.Vijaya Reddy garu into #Congress family.
This growing trust on @INCTelangana will break the arrogance of ruling TRS. pic.twitter.com/Xq2yItF5kS
— Revanth Reddy (@revanth_anumula) June 23, 2022
కాంగ్రెస్ కృషితోనే మెట్రో, ఎయిర్ పోర్ట్: ఎంపీ కోమటిరెడ్డి
ఈ సమయంలో పీజేఆర్ కూతురు విజయారెడ్డి పార్టీలోకి రావడం సంతోషంగా ఉందని, ఎంతోమంది పేదలకు పీజేఆర్ పట్టాలు ఇప్పించారన్నారు. ఆయన కుమార్తె విజయారెడ్డికి మంచి భవిష్యత్ ఉంటుం దన్నారు. ఖైరతాబాద్ సహా ఎక్కడ పోటీ చేసినా ఆమె గెలుస్తుందన్నారు.
కాంగ్రెస్ను గెలిపించుకుంటేనే పీజేఆర్కు నిజమైన నివాళి అని అన్నారు. కాంగ్రెస్ డిమాండ్తో రైతు బంద్ ఇస్తానని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. వరి కొని రెండు నెలలు దాటినా ఇంకా రైతులకు డబ్బులు రాలేదన్నారు. మెట్రో, ఎయిర్ పోర్ట్ కాంగ్రెస్ కృషితోనే వచ్చాయని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.