గత రెండు వారాలుగా అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరగడం, తగ్గడం, మళ్లీ పెరగడం వంటి ఊగిసలాటను చూపుతున్నాయి. 

ఈ పరిణామాలు పాకిస్తాన్‌లోని ఆభరణాల మార్కెట్‌పై స్పష్టమైన ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా పెట్టుబడుల కోసం బంగారం, వెండి వైపు ప్రజల ఆసక్తి గణనీయంగా పెరిగింది.

గత కొన్ని రోజులుగా బంగారం, వెండిపై పెట్టుబడులపై ఆసక్తి బాగా పెరిగిందని, అయితే ధరలు అనూహ్యంగా మారుతున్నందున కస్టమర్లకు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నట్లు చెప్పారు.

ఇటీవల ధరలు ఒక్కసారిగా పడిపోయి, మళ్లీ రెండు రోజుల వ్యవధిలోనే భారీగా పెరగడం వల్ల మార్కెట్‌పై అనిశ్చితి నెలకొందన్నారు. దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు కూడా ఇదే ట్రెండ్‌ను అనుసరిస్తున్నాయి. 

పాకిస్తాన్‌లో 10 గ్రాముల బంగారం ధర ఒక్కసారిగా రూ.20,000కు పైగా పెరిగి రూ.4,40,000 స్థాయికి చేరింది. వెండి ధర కూడా అదే విధంగా ఎగసి, 10 గ్రాముల వెండి రూ.7,800కు చేరింది. 

సాధారణంగా భద్రమైన పెట్టుబడులుగా భావించే బంగారం, వెండి ధరలు ఇలా అకస్మాత్తుగా పడిపోవడం అరుదైన విషయమని వ్యాపారులు చెబుతున్నారు.

ఈ ధరల ఊగిసలాటకు ప్రధాన కారణం మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే. అమెరికా ఇరాన్‌పై దాడి చేయవచ్చన్న ఊహాగానాలు మార్కెట్‌లో భయాందోళనలకు దారి తీశాయి.