ఏపీ టెట్ పరీక్షల ఫలితాలు విడుదల త్వరలో మళ్లీ టెట్ : లోకేష్ వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించిన టెట్‌-2024 పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెట్‌లో అర్హత సాధించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు.

  • Publish Date - June 25, 2024 / 05:17 PM IST

విధాత : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించిన టెట్‌-2024 పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెట్‌లో అర్హత సాధించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. టెట్‌ పరీక్షలో 58.4 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.
ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు నిర్వహించిన టెట్‌కు 2,35,907 మంది పరీక్ష రాయగా , లక్షా 37,904 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. టెట్‌లో అర్హత సాధించని వారికి మరోసారి టెట్‌ నిర్వహిస్తామని, కొత్తగా బీఎడ్‌, డీఎడ్‌ పూర్తయిన వారికి కొత్త టెట్‌లో అవకాశాలు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. మెగా డీఎస్సీకి అందరూ సన్నద్ధం కావాలని పిలుపు నిచ్చారు.

58.4 శాతం ఉత్తీర్ణత నమోదు

ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు నిర్వహించిన టెట్కు 2,35,907 మంది (88.90%) రాశారు. రెండు పేపర్లుగా నిర్వహించిన ఈ పరీక్షలో 1,37,904 మంది (58.4శాతం) మాత్రమే అర్హత సాధించినట్లు అదికారులు వెల్లడించారు. పేపర్ -1A (ఎస్జీటీ రెగ్యులర్)కు 1,13,296 మంది హాజరు కాగా.. 78,142 మంది (66.32శాతం) అర్హత సాధించారు. అలాగే, పేపర్ -1B (ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్)కు 1700 మంది దరఖాస్తు చేసుకోగా.. 790మంది (46.47శాతం) క్వాలిఫై అయ్యారు. పేపర్ 2A (ఎస్ఏ రెగ్యులర్)కు 1,19,500 మంది హాజరు కాగా.. వీరిలో 60,846 మంది (50.96శాతం) మాత్రమే క్వాలిఫై అయ్యారు. పేపర్ -2B (ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్)కు 1,411 మంది హాజరు కాగా.. 1.125మంది (79.73శాతం) అర్హత సాధించినట్లు ఓ ప్రకటనలో తెలిపారు.

Latest News