Vidhaatha

Latest Telugu News

Menu Icon

ఒకరికి ఇక ఒకటే ఓటు.. కొత్త ఏఐ సాఫ్ట్‌వేర్‌తో డూప్లికేట్లకు చెక్‌

స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎన్నడూ లేని విధంగా దేశ చరిత్రలో తొలిసారి కేంద్ర ఎన్నికల కమిషన్ అత్యాధునిక ఏఐ సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నది. దీని సాయంతో బోగస్, నకిలీ, ఒకటికి మించి ఉన్న ఓటర్ల వివరాలు తొలగిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చివరి విడత సర్ కొనసాగుతున్నది. ఈ ప్రక్రియ పూర్తయ్యేలోగా కొత్త సాఫ్ట్‌వేర్‌ను తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. ఒక వ్యక్తికి ఒకటికి మించి ఓటు హక్కు లేకుండా ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి చేయనున్నారు.

విధాత ప్రత్యేకం

కాంగ్రెస్‌లో ‘పరకాల’ గడ్డపై మూడు ముక్కలాట

పరకాల కాంగ్రెస్‌లో మూడు వర్గాల ఆధిపత్య పోరు చర్చనీయాంశంగా మారింది. రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కొండా సురేఖ దంపతులు, ఇనుగాల వెంకట్రాం రెడ్డి వర్గాల మధ్య విభేదాలు ఎందుకు?

విధాత ప్రత్యేకం

నెమ్మదించిన రియల్ ఎస్టేట్.. తగ్గిన రిజిస్ట్రేషన్లు.. పెరిగిన ఆదాయం

తెలంగాణ లో అనుకున్నట్లుగానే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు తగ్గాయి. హైడ్రా భయంతో పలువురు కొనుగోలుదారులు అపార్ట్ మెంట్లలో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.

విధాత ప్రత్యేకం

బోగస్ రేషన్ కార్డుల తొలగింపుపై తెలంగాణ సర్కార్ మీన మేషాలు

బోగస్‌ రేషన్‌ కార్డుల తొలగింపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం మీన మేషాలు లెక్కపెడుతున్నది. రాష్ట్రంలో 3.47 లక్షల బోగస్‌ ఫుడ్‌ సెక్యూరిటీ కార్డులు ఉన్నాయని కేంద్రం తేల్చినా.. రాష్ట్ర అధికారులు ప్రాథమిక పరిశీలనలో 1.44 లక్షల కార్డులు బోగస్‌ అని నివేదిక సిద్ధం చేసినా.. వాటిని తొలగించే విషయలో చర్యలు తీసుకోవడం లేదు.

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

తెలంగాణలో మారిన సినిమా టికెట్‌ ధరలు

తెలంగాణలో మారిన సినిమా టికెట్‌ ధరలు

తెలంగాణలో సినిమా టికెట్ ధరలు మారాయి. నాన్‌ ఏసీ, ఏసీ, స్పెషల్‌ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లకు కొత్త ధరలను ప్రభుత్వం ఖరారు చేసింది. రూ.100 కోట్లకు పైబడిన సినిమాలకు ప్రత్యేక వెసులుబాటు కల్పించింది.

సీఎం రేవంత్ రెడ్డికి కొండా సుస్మిత వార్నింగ్

సీఎం రేవంత్ రెడ్డికి కొండా సుస్మిత వార్నింగ్

వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి కచ్చితంగా నేనే నిల్చుంటానని..నేనే గెలుస్తానని, కాంగ్రెస్ టికెట్ రాకపోయినా ఇండిపెండెంట్ గా పోటీ చేసి నీమీద, నీ అభ్యర్థి రేవూరి ప్రకాశ్ రెడ్డి మీద గెలుస్తానని సీఎం రేవంత్ రెడ్డికి కొండా సుస్మిత స్పష్టం చేశారు. పరకాలలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. నీకు దమ్ముంటే రెండేళ్ల తర్వాతా ఎన్నికలలో కాదు..ఇప్పుడే రేవూరి ప్రకాశ్ రెడ్డితో రాజీనామా చేయించి నువ్వు ప్రచారం చేయి...నేను గెలిచి చూపిస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డికి సుస్మిత సవాల్ విసిరారు. ఈరోజు నీ తమ్ముడి 200 కోట్ల భూ కుంభకోణం గురించి మాత్రమే మాట్లాడాను.. నాకు కౌంటర్ ఇస్తే మీ స్కాములు అన్నీ బయటపెడతానని సీఎం రేవంత్ రెడ్డికి సుస్మిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

పీఎం కేర్స్ నిధుల ఖర్చుపై అభిజిత్ దిప్కే కీలక వ్యాఖ్యలు

పీఎం కేర్స్ నిధుల ఖర్చుపై అభిజిత్ దిప్కే కీలక వ్యాఖ్యలు

2024-25లో రూ.8,452 కోట్ల పీఎం కేర్స్ నిధుల్లో కేవలం రూ.87 లక్షల ఖర్చుపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే విమర్శలు చేశారు. నిధులను ప్రజలకు ఉపయోగించాలని సూచించారు.

ఫోక్ డ్యాన్సర్ల అక్రమ బంధాన్ని బట్టబయలు చేసిన భార్య

ఫోక్ డ్యాన్సర్ల అక్రమ బంధాన్ని బట్టబయలు చేసిన భార్య

వేములవాడలో ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయిని మరో మహిళా ఫోక్ డ్యాన్సర్‌తో కలిసి ఉన్న సమయంలో భార్య శరణ్య పట్టుకోవడం వైరల్‌గా మారింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈడీ విచారణకు సినీనటి నిధి అగర్వాల్‌

ఈడీ విచారణకు సినీనటి నిధి అగర్వాల్‌

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారం కేసులో సినీనటి నిధి అగర్వాల్ ఈడీ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్‌ల ప్రచారం, ఆర్థిక లావాదేవీలపై అధికారులు ఆమెను ప్రశ్నించనున్నారు.