కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం, అనుమతులు, ఆమోదాలు రానందున సీఎం రేవంత్ కేంద్రం పైన పోరాటం చేస్తారా? లేక కేంద్రం సానుకూలంగా ఉన్నప్పటికీ, అడ్డుకుంటున్నారని చెబుతున్నందున కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఇక్కడే ఆందోళన చేపడుతారా? ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నిరసనలు తెలియజేస్తారా?
విధాత ప్రత్యేకం
దేశంలోని చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలను విలీనం చేసుకునే ప్రక్రియను బీజేపీ వేగవంతం చేస్తున్నదా? ఇప్పటి వరకూ పార్టీల్లో చీలికలు పెట్టి, శాసనసభాపక్షాలను విలీనం చేసుకుంటూ వచ్చిన బీజేపీ.. ఇక నేరుగా ఆ యా ప్రాంతీయ పార్టీలను తనలో కలిపేసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నదా? ఈ క్రమంలోనే ఏపీలో బీజేపీ ఫేస్గా పవన్ కల్యాణ్కు ఆఫర్ ఇచ్చిందా? ఇప్పుడు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఇవే అంశాలు చర్చల్లో చోటు చేసుకుంటున్నాయి.
విధాత ప్రత్యేకం
‘దాహమేసినప్పుడే బావి తవ్వడం’ ప్రారంభించినట్లుగా తెలంగాణలో పంట మార్పిడి ప్రకటన ప్రభుత్వానికి ఆపద మొక్కుగా మారిందనే విమర్శలు రైతాంగంలో వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో పంట మార్పిడికి సంబంధించిన పకడ్బందీ ప్రణాళిక రూపొందించడం, అమలు చేయడంలో ప్రభుత్వం, యంత్రాంగం వంద శాతం విఫలమైందని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతులు ఎందుకు మొగ్గు చూపడంలేదనే ప్రాథమిక కారణాలు అందరికీ తెలిసు. అయినా.. దీని మూలాలను నిజాయితీతో పరిష్కరించకుండా, కచ్చితమైన, నమ్మకమైన ప్రణాళిక రూపొందించి రైతులను ఒప్పించడంలో చిత్తశుద్ధి లేదనేది పదేపదే తేలిపోతోంది. మరో మాటలో చెప్పాలంటే దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని పరిశీలకులు అంటున్నారు.
పాడిపంటలు
నీట్ పరీక్ష పత్రం లీకేజీ వ్యవహారానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలనే డిమాండ్తో శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రశాంతంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్వచ్ఛందంగా హాజరయ్యారు. మరి.. దేశంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లేదా ప్రజల కోసమే బతుకుతున్నామనే కమ్యూనిస్టులు ఎందుకు యువతను ఆకర్షించలేక పోతున్నారు? వారు జెన్ జీ భాషను అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారా? లేక ఉద్యమాలకు కదిలే నైజం యువతలో నశించిపోయిందనే నిర్ధారణకు వచ్చేశారా? వారి పిలుపులకు స్పందించని విద్యార్థులు.. కాక్రోచ్ జనతా పార్టీ పిలుపుతో ఎందుకు పోటెత్తారు?
విధాత ప్రత్యేకం