Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

తెలంగాణలో మీనాక్షి ముద్రేదీ?.. కనిపించని కాంగ్రెస్ ఇంచార్జ్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్ ముద్ర ఎక్కడా కనిపించడంలేదనే చర్చ అంతర్గతంగా సాగుతోంది.

పొంగులేటి మీటింగ్ కు పోచంపెల్లి దూరం

రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు మినహా, ప్రతిపక్ష ఎమ్మెల్సీలూ, ఎమ్మెల్యేలు ప్రతిపాదించే అభివృద్ధి పనులకు ఆమోదించడానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని కొంతకాలంగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపెల్లి శ్రీనివాస్ రెడ్డి లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

బండి భగీరథ్ కేసులో మరిన్ని ట్విస్టులు !

బండి భగీరథ్ పోక్సో కేసులో కొత్త ట్విస్టులు చోటుచేసుకున్నాయి. తన పేరు వాడొద్దంటూ బండి సంజయ్ కోర్టును ఆశ్రయించగా, బాలిక వివరాలు ప్రచారం చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

టెన్షన్ సీన్...చావు అంచులను తాకిన మృత్యుంజయులు

బీహార్‌లో రైల్వే పట్టాలు దాటుతుండగా రైలు దూసుకురావడంతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను ప్రాణాలకు తెగించి కాపాడిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పొదుపు చర్యలు ప్రారంభించిన సుప్రీంకోర్టు

ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు సోమ, శుక్రవారాల్లో పూర్తిగా వర్చువల్ విచారణలు నిర్వహించాలని, 50% సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోం అమలు చేయాలని నిర్ణయించింది.

రోజాకి హీరోలెవ‌రు ప్ర‌పోజ్ చేయ‌లేదా..

Roja | ఒకప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన రోజా సెల్వమణి, తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. నగిరి ఎమ్మెల్యేగా విజయం సాధించి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. మరోవైపు బుల్లితెరపై ‘జబర్దస్త్’ వంటి ప్రముఖ షోలతో కూడా ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

ప్రమాదానికి ముందు ఏం జరిగింది..వైరల్ గా నర్మదా బోటు వీడియోలు

నర్మదా బోటు ప్రమాదానికి ముందు జరిగిన ఘటనల వీడియోలు వైరల్ అయ్యాయి. లైఫ్ జాకెట్లు ఇవ్వకపోవడం, ఆలస్యమైన రక్షణ చర్యలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.