Vidhaatha

Latest Telugu News

Menu Icon

లొంగిపోయిన మావోయిస్టుల పయనమెటు!?

ఆపరేషన్‌ కగార్‌ నేపథ్యంలో లొంగిపోయిన మావోయిస్టు కీలక నేతల రాజకీయ భవిష్యత్తేంటనే చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల సీపీఐ నాయకత్వాన్ని పలువురు మావోయిస్టు మాజీ నేతలు కలువడంతో ఈ చర్చ మళ్లీ ఊపందుకున్నది. లొంగుబాట్లకు ముందే భిన్నాభిప్రాయాలతో ఉన్న నాయకులు.. ఇప్పుడు అంతా కలిసి మూకుమ్మడి నిర్ణయాలు తీసుకుంటారా? లేక వ్యక్తులుగా తమ తమ అంచనాల మేరకు వివిధ రాజకీయ పార్టీల్లో చేరతారా? అనేది తేలాల్సి ఉంది.

విధాత ప్రత్యేకం

‘తెలంగాణ’ పండుగ పూట ‘పంచాయతీ’…

తెలంగాణ ప్రజల దశాబ్దాల సమిష్టి పోరాట ఫలితం… వందలాది మంది బిడ్డల బలిదానానికి ప్రతిరూపం ... ఆంధ్ర ఆధిపత్య శక్తులు, పెత్తందారుల కబంధ హస్తాల నుంచి విముక్తి లభించి ... స్వయం పాలన సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు. రాజకీయ భిన్నాభిప్రాయాలెన్ని ఉన్నా ... నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష ప్రతిఫలించిన రోజు... వేడుక నిర్వహించుకుని గతాన్ని బేరీజు వేసుకుని, భవిష్యత్తును తీర్చదిద్దుకునేందుకు ప్రణాళికలు రచించుకునే ప్రత్యేక రోజు. తెలంగాణ ప్రజలు ఆనందంతో నిర్వహించుకునే పర్వదినం. అంతటి ఉద్వేగ భరితమైన రోజున రాజకీయ రచ్చకోసం కుట్రలు చేశారనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాష్ట్రం ఏర్పాటైన సంతోషాన్ని దక్కకుండా చేయడమనే కుట్ర దాగి ఉందనే చర్చకు ఆస్కారాన్ని కలిగిస్తున్నారు.

విధాత ప్రత్యేకం

వేల కోట్లకు బ్యాంకులను ముంచి.. విదేశాలకు పరార్‌.. ఇది చోక్సీ, నీరవ్‌ కథ

బ్యాంకులను ముంచేసిన బడా బాబుల జాబితాలో మరో కీలక పేరు.. మొహుల్‌ చోక్సీ. నీరవ్‌ మోడీకి మేనమామ. ప్రపంచంలోనే అతిపెద్ద బ్రాండెడ్‌ ఆభరణాల చైన్‌ రిటైల్‌ షోరూమ్‌ జెమ్స్‌ అధినేత. ఆభరణాల వ్యాపారంలో దేశంలో 50 శాతానికి పైగా వాటా ఈ కంపెనీదే. ఈ సంస్థ దేశంలోని బ్యాంకులకు ఎగవేసిన మొత్తం 7వేల కోట్ల రూపాయల పైమాటే. ఇక అనుబంధ కంపెనీల మొత్తాన్ని కలుపుకొంటే.. రూ.27,500 కోట్ల వరకు ఉన్నాయని అంచనా. నీరవ్‌మోడీ, ఐవీఆర్‌సీఎల్ కథలూ ఇవే.

విధాత ప్రత్యేకం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేళ సెంటి‘మంటలు’

తెలంగాణవాదులుగా చెప్పుకొనే వారు కూడా తమ అధికారాన్ని కాపాడుకునేందుకు అనుసరించిన అవకాశవాద విధానాల ఫలితంగా తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం ‘నినాదాలు’గా మిగిలిపోయాయనే విమర్శలున్నాయి. దీంతో గోతికాడి నక్కల్లా కాచుకుని కూర్చున్న తెలంగాణలోని సమైక్యవాదులు క్రమంగా రెచ్చిపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ శక్తులు ఇటీవల కాలంలో నెమ్మదిగా ఆధిపత్యాన్ని చెలాయించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

లొంగిపోయిన మావోయిస్టుల పయనమెటు!?

లొంగిపోయిన మావోయిస్టుల పయనమెటు!?

ఆపరేషన్‌ కగార్‌ నేపథ్యంలో లొంగిపోయిన మావోయిస్టు కీలక నేతల రాజకీయ భవిష్యత్తేంటనే చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల సీపీఐ నాయకత్వాన్ని పలువురు మావోయిస్టు మాజీ నేతలు కలువడంతో ఈ చర్చ మళ్లీ ఊపందుకున్నది. లొంగుబాట్లకు ముందే భిన్నాభిప్రాయాలతో ఉన్న నాయకులు.. ఇప్పుడు అంతా కలిసి మూకుమ్మడి నిర్ణయాలు తీసుకుంటారా? లేక వ్యక్తులుగా తమ తమ అంచనాల మేరకు వివిధ రాజకీయ పార్టీల్లో చేరతారా? అనేది తేలాల్సి ఉంది.

క‌ర్ణాట‌క సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం

క‌ర్ణాట‌క సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం

కర్ణాటక నూతన సీఎంగా డీకే శివకుమార్ బుధవారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌భవన్‌లో గవర్నర్ గవర్నర్ థావర్‌చంద్‌ గహ్లోత్ ఆయనతో ప్రమాణం చేయించారు

సోలార్‌ ప్యానెల్‌ వ్యర్థాలతో ఢిల్లీకి కొత్త ముప్పు.. గ్రీన్‌ ఎనర్జీ వెనుక కాలుష్య సంక్షోభం

సోలార్‌ ప్యానెల్‌ వ్యర్థాలతో ఢిల్లీకి కొత్త ముప్పు.. గ్రీన్‌ ఎనర్జీ వెనుక కాలుష్య సంక్షోభం

దేశ రాజధాని ఢిల్లీ మహానగరం ఇప్పటికే వాహన కాలుష్యం, పరిశ్రమల నుండి వెదజల్లే కాలుష్యంతో సతమతమవుతున్నది. దీనికి తోడు సోలార్ ఈ వ్యర్థాలు తోడు కావడంతో వాయు, జల కాలుష్యం మరింత తీవ్రమైంది. సోలార్ ఈ వ్యర్థాల మూలంగా వెదజల్లే కాలుష్యంపై వరల్డ్ రిసోర్స్ ఇన్‌స్టిట్యూట్, చింతన్ ఎన్విరాన్‌మెంటల్‌ రిసెర్చ్‌ అండ్ యాక్షన్ గ్రూప్‌లు సంయుక్తంగా పరిశోధన చేసి నివేదిక రూపొందించాయి. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల నుంచి కాలం చెల్లిన సోలార్ ప్యానెళ్లు, ఫొటో వోల్టాయిక్ సెల్స్, లిథియం ఇయాన్ బ్యాటరీలు పెద్ద ఎత్తున ఢిల్లీకి ఈ వేస్టు రూపంలో తరలిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆ రెండు రాష్ట్రాలలోనే హానికర ఈ వ్యర్థాలను ధ్వంసం చేయాల్సి ఉంటుంది. ఈ వేస్టును రీ సైక్లింగ్ చేసే కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలు ఢిల్లీలో యథేచ్ఛగా, కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలకు విరుద్ధంగా ధ్వంసం చేస్తున్నాయి. దీంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్నదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ కాల్స్ రికార్డు ప్రచారం ఫేక్ : సజ్జనార్

వాట్సాప్ కాల్స్ రికార్డు ప్రచారం ఫేక్ : సజ్జనార్

వాట్సాప్ కాల్స్ రికార్డు అవుతున్నాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా ఫేక్ అని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఇటువంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు.

ఢిల్లీలో అగ్నిప్రమాదం.. 20మంది సజీవ దహనం

ఢిల్లీలో అగ్నిప్రమాదం.. 20మంది సజీవ దహనం

ఢిల్లీలోని మాలవీయ నగర్ లెమన్ గ్రీన్ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుని 20 మంది మృతి చెందారు. పలువురు గాయపడగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.