Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

భారతదేశంలో ఎవరి చేతిలో ఎంత భూమి ఉంది? అసమానతలపై షాకింగ్‌ రిపోర్ట్‌

భారతదేశంలో ప్రతి ఒక్కరూ తమకంటూ కొంత భూమి ఉండాలని కోరుకుంటారు. అది వారి అస్తిత్వ ప్రతీక. అది వారికి ఒక రక్ష. ఆ భూమి.. వారికి గౌరవం. కానీ.. దేశంలో భూమిపై యాజమాన్యం హక్కు విషయంలో తీవ్రమైన వ్యత్యాసాలు ఉన్నాయని తాజాగా ఒక నివేదిక వెల్లడించింది. అంతేకాదు.. కొన్ని షాకింగ్‌ వాస్తవాలను సైతం బయటపెట్టింది.

india-land-inequality-report

డీలిమిటేషన్‌ బిల్లుతో ఉత్తరాదికి ఆధిపత్యం... దేశంలో చీలిక : మేధావుల ఆందోళన

మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన డీలిమిటేషన్‌ బిల్లు దేశాన్ని నిట్టనిలువునా చీల్చనుందని పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్‌కు అభ్యంతరం లేదని, కానీ.. దానితో డీలిమిటేషన్‌ బిల్లును ముడిపెట్టడం బీజేపీ రాజకీయ అవకాశవాదమని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ చర్యకు నిరసనగా ఈ నెల 18 హైదరాబాద్‌లో నిరసన ర్యాలీ చేయాలని నిర్ణయించారు.

women-reservation-delimitation-link-controversy-all-party-meeting-telangana

దేశ చరిత్రలో మహిళ రిజర్వేషన్ బిల్లు కీలక ఘట్టం: ప్రధాని మోదీ

మహిళా రిజర్వేషన్ బిల్లు దేశ చరిత్రలో కీలక ఘట్టమని ప్రధాని మోదీ అన్నారు. మహిళలకు రాజకీయాల్లో 33 శాతం ప్రాతినిధ్యం కల్పించడమే లక్ష్యమన్నారు.

జీవన్ రెడ్డి పార్టీ మార్పు వరమా? శాపమా? రాష్ట్ర రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ

కాంగ్రెస్‌లో దశాబ్దాలపాటు ఉండి.. బీఆరెస్‌ తీర్థం పుచ్చుకుంటున్న జీవన్‌ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతున్నది? స్వేచ్ఛాయుత కాంగ్రెస్‌లో ఇన్నాళ్లూ ఉన్న రేవంత్‌ రెడ్డి.. కుటుంబ ఆధిపత్యంలో నడిచే ప్రాంతీయ పార్టీ బీఆరెస్‌లో మనుగడ సాగించగలరా? ప్రత్యేకించి అనేక మంది వేరే పార్టీల నుంచి బీఆరెస్‌లో చేరి.. మనుగడ సాగించలేని పరిస్థితుల్లో మళ్లీ ఆ పార్టీ నుంచి బయపటడిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. వాటికి భిన్నంగా జీవన్‌ రెడ్డి భవిష్యత్తు ఉంటుందా? లేక మళ్లీ సీన్‌ రిపీట్‌ అవుతుందా?

jeevan-reddy-joins-brs-future-analysis

భూ భారతి చట్టం అమలు అట్టర్‌ఫ్లాప్‌.. కారణాలివే...

అనేక మంది నిపుణులు కూర్చొని, చర్చించి, అనేక నమూనాలు పరిశీలించి.. తెలంగాణ కోసం సమగ్ర భూభారతి చట్టాన్ని తీసుకువచ్చినా... అమలులో చిత్తశుద్ధి లోపించడంలో ఆ చట్టం అట్టర్‌ఫ్లాప్‌ అయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. భూభారతి చట్టం అమల్లోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో విధాత ప్రత్యేక కథనం.

క‌ర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 8 మంది మృతి

Kurnool | ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌ర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. మంత్రాల‌యం మండ‌లం చిల‌క‌ల డోనా వ‌ద్ద జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో అక్క‌డిక‌క్క‌డే 8 మంది ప్రాణాలు కోల్పోయారు.

బాలీవుడ్‌లోకి సాయి పల్లవి ఎంట్రీ…

|Sai Pallavi | సౌత్ స్టార్ సాయి పల్లవి బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న చిత్రం ఏక్ దిన్ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తన సహజ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన సాయి పల్లవి, ఇప్పుడు నార్త్ ఆడియెన్స్‌ను కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందా అన్న ఆసక్తి నెలకొంది.

రప్పా రప్పా ఫైట్..కోబ్రాను ముక్కలు చేసిన ముంగిస

వైరల్​ వీడియో: బలమైన పెద్ద జంతువులు సైతం చిన్న ప్రాణుల పోరాట నైపుణ్యానికి ఓటమి చవి చూస్తుంటాయి. భారీ కోబ్రా ఒకటి ముంగిస నోటికి చిక్కి బలైపోయిన వీడియో ముంగిస పోరాట నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది..