తెలంగాణవాదులుగా చెప్పుకొనే వారు కూడా తమ అధికారాన్ని కాపాడుకునేందుకు అనుసరించిన అవకాశవాద విధానాల ఫలితంగా తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం ‘నినాదాలు’గా మిగిలిపోయాయనే విమర్శలున్నాయి. దీంతో గోతికాడి నక్కల్లా కాచుకుని కూర్చున్న తెలంగాణలోని సమైక్యవాదులు క్రమంగా రెచ్చిపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ శక్తులు ఇటీవల కాలంలో నెమ్మదిగా ఆధిపత్యాన్ని చెలాయించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
విధాత ప్రత్యేకం
2012 నుంచి అనిల్ అంబానీ కంపెనీలు ఆదాయం లేక దివాలా దిశగా పయనిస్తున్నా బ్యాంకులు ఏమాత్రం వెనకడుగు వేయకుండా 2019 వరకు రుణాలు ఇస్తూ వెళ్లాయి. తీసుకున్న రుణాలను వాయిదాల ప్రకారం చెల్లించకుండా, నిధులను దారి మళ్లించినట్లు బ్యాంకుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పెద్ద ఎత్తున విమర్శలు రావడం, సుప్రీంకోర్టు ఆదేశాలకు అప్పులు ఇచ్చిన బ్యాంకులు ఎట్టకేలకు అనిల్ అంబానీపై కేసులు పెట్టాయి. అనిల్ అంబానీ మొత్తం రూ.73వేల కోట్లు బకాయి పడినట్లు ఈడీ అధికారికంగా ప్రకటించడంతో దేశ ప్రజలు నివ్వెరపోయారు.
విధాత ప్రత్యేకం
ఒకవైపు కేరళలో అధిష్ఠానం తన అభిప్రాయాన్ని పక్కనపెట్టి.. పార్టీ నేతల అభీష్టానికి విలువనిచ్చి.. సతీశన్ను సీఎం చేసింది. తదుపరి కర్ణాటకలో సైతం పార్టీ నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని డీకే శివకుమార్కు మార్గం సుగమం చేసింది. మరి తెలంగాణకూ ఈ రాజకీయ రుతుపవనం తాకుతుందా? 2034 వరకూ నేనే సీఎం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీలున్న ప్రతివేదికపైనా బలంగా బల్లగుద్దుతున్నారు. దీని వెనుక ప్లాన్ బీ ఏమైనా ఉన్నదా?
విధాత ప్రత్యేకం
దేశంలో దొంగలు పడ్డారు అనేది పాత సామెత. కానీ బీజేపీ ప్రభుత్వ హయాంలో ‘బ్యాంకుల్లో గజదొంగలు పడ్డారు’ అనేది కొత్త స్లోగన్గా మారిపోయిందనే పరిస్థితి నెలకొన్నది. గడిచిన 11 ఏళ్లలో గుప్పెడు మంది కార్పొరేట్ బడాబాబులకు ఏకంగా 9.75 లక్షల కోట్ల రూపాయల రుణాలు రైటాఫ్ చేశారంటే.. వారి పట్ల ప్రభుత్వం ఎంత ఉదారంగా ఉన్నదో అర్థమవుతున్నది. దీనిపై విధాత వరుస కథనాలు. ది గ్రేట్ ఇండియన్ బ్యాంక్ రాబరీ పార్ట్ 1 చదవండి..
విధాత ప్రత్యేకం