Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

ఫ్రీజ్ చేసిన మెదడుకు మళ్లీ జీవం పోసిన శాస్త్రవేత్తలు.. క్రయోప్రిజర్వేషన్‌లో విప్లవాత్మక ముందడుగు

సినిమాల్లో చూసి ఉంటా.. లేదా నవలల్లో చదివి ఉంటాం! ఒక వ్యక్తి మెదడును సుదీర్ఘకాలం భద్రపరిచి.. ఒకానొక కీలక సమయంలో దాన్ని తిరిగి యాక్టివేట్‌ చేస్తారు! కాకపోతే ఇది ఫిక్షన్‌! కానీ.. ఈ ఊహను వాస్తవానికి దగ్గరగా తీసుకుపోయే ప్రయత్నం చేశారు శాస్త్రవేత్తలు. ఫ్రీజ్‌ చేసిన మెదడును తిరిగి యాక్టివేట్‌ చేశారు.

german scientists brain experiment- AI-generated image representational purposes only

ఇటు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ..అటు పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ

ఏపీ, తెలంగాణలో ఒకే రోజు సోమవారం రెండు కీలక విగ్రహాల ఆవిష్కరణ ఘట్టాలు జరుగడం ఆసక్తికరం. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభోత్సవానికి ముందు అసెంబ్లీ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆవిష్కరించారు. అటు ఏపీ రాజధాని అమరావతిలోని శాఖమూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు 125 జయంతి సందర్బంగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.

Telangana Statue

డ్రగ్స్‌ కేసులో పైలట్‌ రోహిత్‌రెడ్డి సహా ముగ్గురికి రిమాండ్

మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ పార్టీలో పట్టుబడిన 11మంది నిందితులలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా అతని సోదరుడు రితేష్ రెడ్డి, ఢిల్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ శర్మలకు ఉప్పర్‌పల్లి జడ్జి 14రోజుల రిమాండ్ విధించారు. దీంతో వారిని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. మిగిలిన 8మంది నిందితులను స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు.

మరింతగా తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు వరుస తగ్గుదలను నమోదు చేస్తున్నాయి. సోమవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 490 తగ్గి రూ. 1,59,170వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర రూ. 100తగ్గి రూ. 2,79,900వద్ద కొనసాగుతుంది.

Gold Silver Rates Toaday

98వ ఆస్కార్ అవార్డులు ..

Oscar Awards 2026 | హాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 98వ అకాడమీ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల్లో కొన్ని క్రేజీ సినిమాలు అద్భుత విజయాలు సాధించాయి. ముఖ్యంగా ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ మరియు ‘సిన్నర్స్’ సినిమాలు అవార్డుల వేదికపై దూసుకుపోయాయి.

ఎయిరిండియా ఉద్యోగుల కక్కుర్తి.. ఫ్రీ టికెట్లను అధిక ధరలకు అమ్ముకున్న 4 వేల మంది!

Air India | ఎయిరిండియాలో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. ఎంప్లాయీ లీజర్ ట్రావెల్ ( Employee Leisure Travel ) కింద ఇచ్చే ఉచిత టికెట్లను పలువురికి అమ్ముకున్నారు. దాదాపు 4 వేల మంది ఈ అవినీతికి పాల్పడినట్లు సంస్థ గుర్తించింది.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన పవన్ కళ్యాణ్ చెప్పులు…

Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం చేసినా రెండు తెలుగు రాష్ట్రాల్లో వెంటనే చర్చనీయాంశం అవుతుందనడంలో సందేహం లేదు. ఆయన రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్నా, పార్టీ సమావేశంలో మాట్లాడినా, లేక సినిమా ఈవెంట్‌కు హాజరైనా అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకుల దృష్టి కూడా ఆయనపైనే ఉంటుంది.