Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

చిరకాల ప్రత్యర్థిపై మరో ఘనవిజయం – భారత్​ సూపర్​–8 ప్రవేశం

టి20 వరల్డ్‌కప్ 2026లో కొలంబో వేదికగా జరిగిన హై వోల్టేజ్ పోరులో భారత్ 61 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. ఇషాన్ కిషన్ 77 పరుగులతో మెరుపులు మెరిపించగా, భారత బౌలర్లు కట్టుదిట్టంగా రాణించి పాక్‌ను 130 పరుగులకే కట్టడి చేశారు. భారత్ 6 పాయింట్లతో సూపర్–8లోకి ప్రవేశించింది.

Ishan Kishan smashes boundary during IND vs PAK T20 World Cup 2026

కొత్తగూడెం కోసం కీలక మంత్రి కిరికిరి.. వచ్చే ఎన్నికల్లో సీపీఐ దూరమయ్యేనా?

రాష్ట్రంలో మంత్రిగా వ్యవహరిస్తూ ఖమ్మం జిల్లాలో అందరినీ తానే గెలిపించానని చెప్పుకొనే ఒక మంత్రి సీపీఐతో పొత్తును విచ్ఛిన్నం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారని జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆందోళనతో ఉన్నారు. తనకు కావాల్సిన ఒక్క అసెంబ్లీ సీటు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సీపీఐ మద్ధతును గల్లంతు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి.

బ్రహ్మపుత్ర నది కింద రోడ్డు-రైలు హైబ్రిడ్ అండర్‌వాటర్ టన్నెల్!

దేశంలోనే తొలి రోడ్డు-రైలు హైబ్రిడ్ అండర్‌వాటర్ టన్నెల్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బ్రహ్మపుత్ర నది కిందుగా రోడ్డు-రైలు మార్గాలను కలిపే దేశపు తొలి అండర్‌వాటర్ సొరంగంను రూ.18,600 కోట్లతో నిర్మించేందుకు కేంద్ర కేబినెట్ అనుమతి లభించింది.

నేనే రాజు నేనే మంత్రి వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు : సీఎం రేవంత్ రెడ్డి

నేనే రాజు, నేనే మంత్రి అని నేను మాట్లాడిన మాటలను వేరే విధంగా అర్థం చేసుకున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రి నేనే, మున్సిపల్ మంత్రి నేనే అయినందునా మున్సిపల్ ఎన్నికల పలితాలకు నాదే బాధ్యత..నా పనితీరుకు గీటురాయి అని చెప్పే క్రమంలో ఆ వ్యాఖ్యలు చేశానన్నారు.

ఏలియన్స్ ఉన్నారు..అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా వ్యాఖ్యలు వైరల్

ఏలియన్స్ (గ్రహంతర వాసులు) ఉనికికి సంబంధించిన వార్తలు, ఊహాగానాలు.. ఎగిరే వస్తువుల సమాచారం ఎప్పుడొచ్చిన అందరూ ఆసక్తి ప్రదర్శిస్తుంటారు. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబమా ఏలియన్స్ ఉనికిపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఏలియన్స్ ఉనికి నిజమని, విశ్వంలోని ఏదో ఒక గ్రహంపై గ్రహాంతర వాసులు ఉండే విషయాన్ని తాను బలంగా నమ్ముతున్నానని ఒబామా పేర్కొన్నారు.

కొత్తగూడెం మేయర్ పదవి చెరో రెండున్నరేళ్లు: కాంగ్రెస్-సీపీఐ డీల్

కొత్తగూడెం కార్పొరేషన్‌ మేయర్‌ పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకునేలా కాంగ్రెస్, సీపీఐలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. మొదటి రెండున్నరేళ్లు మేయర్‌ పదవి సీపీఐకి, డిప్యూటీ మేయర్‌ పదవి కాంగ్రెస్‌ తీసుకోవాలని, ఆ తర్వాత రెండున్నరేళ్లు కాంగ్రెస్‌ మేయర్‌ పదవి, సీపీఐ డిప్యూటీ మేయర్‌ పదవి తీసుకోవాలని రెండు పార్టీలు నిర్ణయించుకున్నాయి.