తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు వెనుక ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. రాష్ట్రంలో అసమ్మతి రాగం ఊపందుకుంటున్న సమయంలో గ్యాప్ ఇవ్వడం అంటే అసలుకే మోసం తెస్తుందని నిఘా వర్గాల సూచన ఆయన తన పర్యటనను రద్దు చేసుకోవడానికి ప్రధాన కారణంగా చర్చించుకుంటున్నారు. ఆరెస్సెస్లోని ఒక కీలక నేత సహకారంతో కేంద్రమే పర్యటనకు అనుమతి ఇవ్వలేదని చెప్పించారని తెలుస్తున్నది.
విధాత ప్రత్యేకం
స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎన్నడూ లేని విధంగా దేశ చరిత్రలో తొలిసారి కేంద్ర ఎన్నికల కమిషన్ అత్యాధునిక ఏఐ సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నది. దీని సాయంతో బోగస్, నకిలీ, ఒకటికి మించి ఉన్న ఓటర్ల వివరాలు తొలగిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చివరి విడత సర్ కొనసాగుతున్నది. ఈ ప్రక్రియ పూర్తయ్యేలోగా కొత్త సాఫ్ట్వేర్ను తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. ఒక వ్యక్తికి ఒకటికి మించి ఓటు హక్కు లేకుండా ఈ సాఫ్ట్వేర్ను ఉపయోగించి చేయనున్నారు.
విధాత ప్రత్యేకం
పరకాల కాంగ్రెస్లో మూడు వర్గాల ఆధిపత్య పోరు చర్చనీయాంశంగా మారింది. రేవూరి ప్రకాశ్రెడ్డి, కొండా సురేఖ దంపతులు, ఇనుగాల వెంకట్రాం రెడ్డి వర్గాల మధ్య విభేదాలు ఎందుకు?
విధాత ప్రత్యేకం
తెలంగాణ లో అనుకున్నట్లుగానే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు తగ్గాయి. హైడ్రా భయంతో పలువురు కొనుగోలుదారులు అపార్ట్ మెంట్లలో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.
విధాత ప్రత్యేకం