సైబరాబాద్ సంపన్నులకు మాత్రమే రిజర్వు చేయబడుతున్నది. ధరల రిగ్గింగు అడ్డూ అదుపు లేకుండా జరిగిపోతున్నది. సైబరాబాద్ రిచ్ అండ్ ఫేమస్ వర్గాల నగరంగా రూపాంతరం చెందుతున్నది. ప్రభుత్వ భూములన్నీ హరించుకుపోతున్నాయి. ఒకప్పుడు ఎకరా స్థలంలో లక్ష చదరపు అడుగుల నిర్మాణం మాత్రమే జరిగేది. ఇప్పుడు ఎనిమిది లక్షలు, పది లక్షలు చదరపు అడుగులు కడుతున్నారు. అయినా ధరలు మాత్రం ధనిక వర్గాలు మాత్రమే కొనగలిగే విధంగా పెడుతున్నారు.
అభిప్రాయం
ప్రతిపక్ష పార్టీల కొంపలు కూల్చుతున్నదన్న ఆరోపణలు మూటగట్టుకుంటున్న సర్ ప్రక్రియ తెలంగాణలో విపక్ష పార్టీలను యాక్టివేట్ చేస్తున్నది. సర్ నేపథ్యంలో అనుకూల ఓటింగ్ ను కాపాడుకునేందుకు క్షేత్రస్థాయి క్యాడర్ వద్దకు కాంగ్రెస్, బీఆరెస్ నాయకులు పరుగులు తీస్తున్నారు. పార్టీ ఓటింగ్ ను కాపాడాల్సింది మీరేనంటూ నచ్చజెప్పుకొంటున్నారు.
విధాత ప్రత్యేకం
దేశంలో లక్షలాది మంది సీబీఎస్ఈ విద్యార్థుల మనోవేదన, మానసిక ఒత్తిడి, ఆత్మహత్యలకు పురిగొల్పేలా వ్యవహరించిన ఆన్ లైన్ స్క్రీనింగ్ అండ్ మార్కింగ్ (ఓఎస్ఎం) కాంట్రాక్టు దక్కించుకున్న ఏజెన్సీ పై కేంద్ర ప్రభుత్వం ఇంత వరకు చర్యలు తీసుకోలేదనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన జరిగి రెండు వారాలు గడుస్తున్నా సదరు సంస్థ పై ఈగ వాలకుండా కేంద్రం వ్యవహరిస్తున్న తీరు విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.
విధాత ప్రత్యేకం
తెలంగాణలో 2014-15 సంవత్సరంలో ఎక్సైజ్ ఆదాయం సర్కారుకు రూ.10 వేల కోట్లు ఉండగా ఇప్పుడది రూ.40 వేల కోట్లకు పెరిగింది. అంటే ఇంచుమించు 400 శాతం పెరుగుదల కనిపిస్తున్నది. మొత్తంగా ఏటా లక్ష కోట్ల రూపాయల మద్యం వినియోగమవుతున్నట్టు అంచనా.
విధాత ప్రత్యేకం