తెలంగాణ ప్రజల దశాబ్దాల సమిష్టి పోరాట ఫలితం… వందలాది మంది బిడ్డల బలిదానానికి ప్రతిరూపం ... ఆంధ్ర ఆధిపత్య శక్తులు, పెత్తందారుల కబంధ హస్తాల నుంచి విముక్తి లభించి ... స్వయం పాలన సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు. రాజకీయ భిన్నాభిప్రాయాలెన్ని ఉన్నా ... నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష ప్రతిఫలించిన రోజు... వేడుక నిర్వహించుకుని గతాన్ని బేరీజు వేసుకుని, భవిష్యత్తును తీర్చదిద్దుకునేందుకు ప్రణాళికలు రచించుకునే ప్రత్యేక రోజు. తెలంగాణ ప్రజలు ఆనందంతో నిర్వహించుకునే పర్వదినం. అంతటి ఉద్వేగ భరితమైన రోజున రాజకీయ రచ్చకోసం కుట్రలు చేశారనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాష్ట్రం ఏర్పాటైన సంతోషాన్ని దక్కకుండా చేయడమనే కుట్ర దాగి ఉందనే చర్చకు ఆస్కారాన్ని కలిగిస్తున్నారు.
విధాత ప్రత్యేకం
బ్యాంకులను ముంచేసిన బడా బాబుల జాబితాలో మరో కీలక పేరు.. మొహుల్ చోక్సీ. నీరవ్ మోడీకి మేనమామ. ప్రపంచంలోనే అతిపెద్ద బ్రాండెడ్ ఆభరణాల చైన్ రిటైల్ షోరూమ్ జెమ్స్ అధినేత. ఆభరణాల వ్యాపారంలో దేశంలో 50 శాతానికి పైగా వాటా ఈ కంపెనీదే. ఈ సంస్థ దేశంలోని బ్యాంకులకు ఎగవేసిన మొత్తం 7వేల కోట్ల రూపాయల పైమాటే. ఇక అనుబంధ కంపెనీల మొత్తాన్ని కలుపుకొంటే.. రూ.27,500 కోట్ల వరకు ఉన్నాయని అంచనా. నీరవ్మోడీ, ఐవీఆర్సీఎల్ కథలూ ఇవే.
విధాత ప్రత్యేకం
తెలంగాణవాదులుగా చెప్పుకొనే వారు కూడా తమ అధికారాన్ని కాపాడుకునేందుకు అనుసరించిన అవకాశవాద విధానాల ఫలితంగా తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం ‘నినాదాలు’గా మిగిలిపోయాయనే విమర్శలున్నాయి. దీంతో గోతికాడి నక్కల్లా కాచుకుని కూర్చున్న తెలంగాణలోని సమైక్యవాదులు క్రమంగా రెచ్చిపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ శక్తులు ఇటీవల కాలంలో నెమ్మదిగా ఆధిపత్యాన్ని చెలాయించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
విధాత ప్రత్యేకం
2012 నుంచి అనిల్ అంబానీ కంపెనీలు ఆదాయం లేక దివాలా దిశగా పయనిస్తున్నా బ్యాంకులు ఏమాత్రం వెనకడుగు వేయకుండా 2019 వరకు రుణాలు ఇస్తూ వెళ్లాయి. తీసుకున్న రుణాలను వాయిదాల ప్రకారం చెల్లించకుండా, నిధులను దారి మళ్లించినట్లు బ్యాంకుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పెద్ద ఎత్తున విమర్శలు రావడం, సుప్రీంకోర్టు ఆదేశాలకు అప్పులు ఇచ్చిన బ్యాంకులు ఎట్టకేలకు అనిల్ అంబానీపై కేసులు పెట్టాయి. అనిల్ అంబానీ మొత్తం రూ.73వేల కోట్లు బకాయి పడినట్లు ఈడీ అధికారికంగా ప్రకటించడంతో దేశ ప్రజలు నివ్వెరపోయారు.
విధాత ప్రత్యేకం