Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

కొత్త కార్పొరేషన్లకు సర్కిళ్ల పంపకం పూర్తి చేసిన ప్రభుత్వం : సవరించిన జాబితా ఇదే..!

హైదరాబాద్‌ను మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజిస్తూ ప్రభుత్వం చేపట్టిన జీహెచ్‌ఎంసీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 60 సర్కిళ్లను పునర్విభజించింది. జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల పరిధిలోకి వచ్చే సర్కిళ్ల పూర్తి వివరాలు ఇవే.

GHMC reorganisation map showing division of Hyderabad into GHMC, Cyberabad and Malkajgiri municipal corporations

అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుక కుట్ర నిజమేనా..?

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుక కుట్ర దాగి ఉందన్న అనుమానాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. అజిత్ పవార్ మేనల్లుడు, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) నేత, ఎమ్మెల్యే రోహిత్ పవార్ తాజాగా చేసిన సంచలన ఆరోపణలు విమాన ప్రమాదంపై అనుమానాలు మళ్లీ రాజేశాయి.

జీతాలు, రైతు భరోసాకూ అప్పులే దిక్కా! రెండేళ్లలోనే రూ.1.27 లక్షల కోట్ల రుణాలు తీసుకున్న రేవంత్ సర్కార్‌

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఖర్చులు నానాటికీ పెరుగుతుంటే.. ఆదాయం మాత్రం తగ్గిపోతున్నది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై మరింతగా ఆధారపడుతున్నది. కాగ్‌ లెక్కల ప్రకారం.. గడిచిన రెండేళ్లలోనే 1.27 లక్షల కోట్లకు పైగా రుణాలు తీసుకున్నట్టు వెల్లడైంది. రైతు భరోసా మొదలుకుని.. వేతనాల వరకూ అనేక చెల్లింపులు కూడా అప్పుల ద్వారానే జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరోసారి చర్చ మొదలైంది.

The Telangana Secretariat

మెనోపాజ్‌, పెరిమెనోపాజ్‌.. వైద్యుల సహాయం ఏ సమయంలో అవసరం?

మెనోపాజ్‌ దశ అనేది మహిళ తన జీవితకాలంలో భరించాల్సిన ఒక పరిస్థితి అనే దురభిప్రాయం చాలా మంది మహిళల్లో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కానీ.. మెనోపాజ్‌, పెరిమెనోపాజ్‌ దశల్లో కనిపించే అన్ని లక్షణాలకూ చికిత్స ఉందని, ఈ దశల్లో మహిళలు మౌనంగా బాధపడాల్సిన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు. మెనోపాజ్‌ అనేది ఒక దశ ముగింపుగానే చూడటం కాకుండా.. మన ఆరోగ్యం, మన జీవిన విధానం, ప్రాధాన్యాలను పునర్నిర్వచించుకునేందుకు దీనిని ఉపయోగించుకోవాలని కోరుతున్నారు.

Menopause

నిలిచిన రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులు.. కొనుగోలుదారుల అరిగోస.. నిపుణులు ఏమంటున్నారు?

మధ్య తరగతి ప్రజలకు సొంతిల్లు ఒక కల! ఆ కల కోసం రేయింబళ్లు కష్టపడతారు. కడుపు కట్టుకొని రూపాయి రూపాయి పోగేస్తారు. పొదుపు చేసుకున్న సొమ్మునంతా తీసుకెళ్లి బిల్డర్‌ చేతిలో పోస్తారు! ఇక రెండేళ్లలో సొంతింటికి వెళ్లడమేనంటూ కలలు కంటూ ఉంటారు. కలల తీరానికి చేరుకునే మార్గంలా ఈఎంఐలు మొదలవుతాయి కానీ.. ఏం విచిత్రమోకానీ.. కలల తీరం మాత్రం చేతికి అందడం లేదు. ఇదే రియల్‌ ఎస్టేట్‌ మాయాజాలం! మహా మోసం!

hyderabad prelaunch scam crisis image created with AI help

పిల్ల‌ల కోసం స‌రికొత్త పెన్ష‌న్ ప్లాన్..! కొంచెం పొదుపు చేస్తే కోట్ల‌లో నిధి..!!

NPS Vatsalya | పిల్ల‌ల చ‌దువుల‌కు, వారి పెళ్లిళ్ల‌కు త‌ల్లిదండ్రులు డ‌బ్బును జ‌మ చేస్తుంటారు. ఏదో రూపంలో మొత్తంగా డ‌బ్బును పొదుపు చేస్తారు. ఇక చ‌దువులు, పెళ్లిళ్లు అయిపోయాక త‌మ బాధ్య‌త అయిపోయింద‌ని ఊపిరి పీల్చుకుంటారు. కానీ పిల్ల‌ల వృద్ధాప్య జీవితం గురించి ఏ మాత్రం ఆలోచించ‌రు. అందుకోస‌మే కేంద్ర ప్ర‌భుత్వం ఎన్‌పీఎస్ వాత్సల్య( NPS Vatsalya ) అనే స‌రికొత్త పెన్ష‌న్ ప‌థ‌కాన్ని అందుబాటులోకి తీసుకోచ్చింది. ఈ ప‌థ‌కం వివ‌రాల‌ను స‌మ‌గ్రంగా తెలుసుకుందాం.

బ్యూటీ విత్ బ్రెయిన్ ..

Sreeleela | టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరోయిన్ శ్రీలీల మరో అరుదైన ఘనతను సాధించింది. సినీ కెరీర్‌తో పాటు చదువుకూ సమాన ప్రాధాన్యం ఇస్తూ ఆమె మెడికల్ గ్రాడ్యుయేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది.