విధాత,పి.గన్నవరం: తూర్పుగోదావరి జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటనలో భాగంగా పి.గన్నవరంలో భవిత కేంద్రాన్ని సీఎం సందర్శించారు. మానసిక స్థితి సరిగా లేని చిన్నారుల తల్లిదండ్రులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు తరగతి గదిలో బెంచ్పై జగన్ కూర్చొన్నారు. బడుల ప్రారంభం సందర్భంగా తరగతి గదిలో బోర్డుపై ‘ఆల్ ద వెరీ బెస్ట్’ అని సీఎం రాశారు. అనంతరం పి.గన్నవరం జడ్పీ పాఠశాలలో తరగతి గదులను ఆయన పరిశీలించారు.