Site icon vidhaatha

ఏపీలో పోలీస్ స్టేషన్లో కరోనా కలకలం

విధాత:ఏపీ లోని నెల్లూరు జిల్లా కావలి రూరల్ పోలీస్ స్టేషన్ లో కరోనా కలకలం సృష్టించింది.ఏకంగా తొమ్మిది మంది పోలీస్ సిబ్బంది కరోనా బారిన పడ్డారు.సీఐ, ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ సహా మొత్తం 9 మందికి కరోనా సోకింది.దీంతో స్థానిక వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది కుటుంబ సభ్యులందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.ఒకే స్టేషన్ లో ఎంతమందికీ కరోనా సోకడంతో స్టేషనుకు వచ్చి వెళ్లిన వారి వివరాలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సేకరిస్తున్నారు.

Exit mobile version