Site icon vidhaatha

అగ్రిగోల్డ్ బాధితుల నమోదు గడువు పొడగింపు

విధాత:ఈనెల 19 సాయంత్రం 5 వరకు.. అగ్రిగోల్డ్ డిపాజిటర్ల వివరాలను సరిచూసుకునేందుకు సీఐడీ గడువు పొడిగించింది.రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 6 నుంచి డిపాజిటర్ల వివరాలను సేకరణ కొనసాగుతోంది.రూ. 20 వేలలోపు డిపాజిట్ చేసిన బాధితులు తమ వివరాలను సరిచూసుకోవచ్చని సీఐడీ తెలిపింది.డబ్బు చెల్లించిన అసలు రసీదులతో వాలంటీర్ల వద్ద వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది.వాలంటీర్ల వద్ద వీలు కాకపోతే ఎంపీడీవో కార్యాలయంలో పత్రాలు ఇవ్వాలని తెలిపింది.

Exit mobile version