Site icon vidhaatha

పేద ప్రజలకు 10కేజీల చొప్పున ఉచితంగా బియ్యం

ఆంధ్రప్రదేశ్‌లోని పేద ప్రజలకు 10 కేజీల చొప్పున ఉచిత బియ్యం అందించేందుకు సీఎం వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. మే, జూన్‌ రెండు నెలలపాటు పేదలకు ఉచిత బియ్యం అందించనుంది. కేంద్రం ఇచ్చే 5 కేజీల బియ్యానికి అదనంగా మరో 5 కేజీలను రాష్ట్రప్రభుత్వం ఇవ్వనుంది. సీఎం జగన్‌ నిర్ణయంతో మొత్తం 1.47 కోట్ల కార్డుదారులకు లబ్ధి చేకూరనుంది. కేంద్రం ఇచ్చే రేషన్‌ బియ్యంతో 88 లక్షల మంది మాత్రమే లబ్ధి పొందనున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన 59 లక్షల మందికి ఉచితంగా బియ్యం ఇవ్వాలని సీఎం జగన్‌ నిర్ణయించారు.

Exit mobile version