Site icon vidhaatha

న్యాయస్థానం టూ దేవస్థానం రాజధాని రైతుల మహా పాదయాత్రకు అనుమతి ఇచ్చిన హైకోర్టు

విధాత‌: రాజధాని రైతులు అనుమతి కోసం వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జ‌రిగింది.పాదయాత్రకు అనుమతి ఇవ్వకూడదని అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రభుత్వ త‌రుపు న్యాయవాది.పోలీసులు అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో సహేతుకమైన కారణాలు లేవని వివరించిన న్యాయవాది ఇవి లక్ష్మీనారాయణ.

పాదయాత్రకు అనుమతిస్తే అభ్యంతరం ఏమిటని ప్రశ్నించిన హైకోర్టు,రైతుల పాదయాత్రపై గ్రామాల్లో రాళ్లు వేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసిన ప్రభుత్వ న్యాయవాది.శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని చెప్ప‌గా, రైతులు శాంతియుతంగా పాదయాత్ర చేసుకుంటారని చెప్పిన న్యాయవాది లక్ష్మీనారాయణ దీంతో షరతులతో అనుమతించిన హైకోర్టు.

Exit mobile version