Site icon vidhaatha

మా పాపని డాక్టర్లే చంపేశారు.. ఎంజే నాయుడు హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత

విధాత: మా పాపని డాక్టర్లే చంపేశారంటూ తల్లిదండ్రులు, బంధువులు విజయవాడలోని ఎంజే ఆసుప్రతి వద్ద ఆందోళనకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. లిఖిత అనే బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా బాలిక మృతి చెందిందని ఆసుపత్రి ఎదుట తల్లిందండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు అక్కడికి చేరుకుని బందోబస్తు చేపట్టారు. ఈ ఘటనపై అటు ఆసుపత్రి యాజమాన్యం స్పందించకోవడంతో తమకు న్యాయం జరిగే వరకు, ఆసుపత్రిని సీజ్‌ చేసే వరకు కదిలేది లేదంటూ కుటుంబ సభ్యులు ఆందోళన కొనసాగిస్తున్నారు.

Exit mobile version