Site icon vidhaatha

దేశంలో నాలుగు ఇళ్లు నిర్మిస్తే అందులో ఒకటి ఏపీలోదే: రోజా

విధాత,తిరుపతి: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శనంలో ఎమ్మెల్యేలు రోజా, భూమన కరుణాకర్ రెడ్డిలు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేలను ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేసారు. స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఏపిలో 28 లక్షల గృహాలు మహిళల పేరు మంజూరు చేసి సీఎం వైఎస్‌ జగన్‌ మహిళలకి అన్న అయ్యాడు అని తెలిపారు. దేశంలో నాలుగు ఇళ్లు నిర్మిస్తే అందులో ఒకటి ఏపీలోదే అన్నారు. సీఎం జగన్‌ 4 లక్షల కోట్ల ఆస్తిని మహిళలకు అందించారని తెలిపారు. 50 శాతానికి పైగా నామినేటెడ్ పోస్టులు మహిళలకు కేటాయించారు.. దిశ యాప్ ప్రవేశపెట్టి మహిళలకు అండగా నిలిచారు అని ఎమ్మెల్యే రోజా తెలిపారు.

Exit mobile version