Site icon vidhaatha

కే ఏ పాల్ సంచలన కామెంట్స్

ఏపీ లో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోందినిన్న విశాఖలో ఏడాది పాప కరోనాతో ఆక్సిజన్ అందక చనిపోవడం బాధాకరంకరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో ఏపీ లో టెన్త్,ఇంటర్ పరీక్షలు నిర్వహించడం అవివేకం.

కరోనా సోకితే విద్యార్థుల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు.పొరుగు రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా వేయడం జరిగింది.హైకోర్టులో పరీక్షలు వాయిదా వేయాలని పిటిషన్ దాఖలు చేశాను.ముఖ్యమంత్రి జగన్ ఇటువంటి పరిస్థులలో పిల్లలను పరీక్షలకు పంపుతారా?మంత్రులు పంపుతారా?

మీ పిల్లలవే ప్రాణాలా?

కరోనా సునామీ కన్నా ప్రమాదకరంగా మారింది.దేశంలో ఎన్నో లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు.కుంభమేళా జరిపి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా ఉధృతకు దారితీసింది.ఎన్నికల సమయాల్లో బహిరంగ సభలు,సమావేశాలు ఏర్పాటు చేసి కరోనా ప్రభలడానికి రాజకీయ నేతలు,ఎన్నికల సంఘం కారణం.

విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మడం పై హైకోర్టులో పిటిషన్ వేశాను

విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా అడ్డుకుంటాం.రెండు నెలలుగా ఎన్నో రాష్ట్రాలు తిరిగాను,ఎందరో ముఖ్యమంత్రులను కలిశాను.దేశంలో పరిస్తులు చాలా దారుణంగా ఉన్నాయి.ఏపీ కి ఆక్సిజన్,వాక్సిన్,కిట్లు పంపించాలని పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను,విదేశీ నేతలను కోరాను.

ఏపీ హైకోర్టు పరీక్షలపై నిర్ణయం తీసుకోకుంటే విద్యార్థులు కరోనాకు బలైపోయే అవకాశం ఉంది.ఇపుడు రాష్ట్రంలో కావాల్సింది రాజకీయ పోటీ,ఫైటింగ్ కాదు

ప్రజలు,విద్యార్థుల ప్రాణాలు ముఖ్యం.ముఖ్యమంత్రి జగన్ ను నా బిల్డింగ్ లు వాడుకోమన్నాను.1000 బెడ్లు ఇస్తాను అన్నాను.ముఖ్యమంత్రి జగన్ విద్యార్థుల భవిష్యత్,ప్రాణాలు గురించి ఆలోచించాలి.

Exit mobile version