విధాత:తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిపై కేఆర్ఎంబీకి ఏపీ వాస్తవాలు వివరించింది.శ్రీశైలం జలాశయంలో విద్యుత్ ఉత్పత్తిపై ఏపీ అభ్యంతరం.ఉమ్మడి ప్రాజెక్టులపై సాగు, తాగునీటి అవసరాలను పరిగణించి విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉందని ఏపీ ప్రభుత్వం లేఖలో పేర్కొంది.తెలంగాణ వాదన పూర్తి అసంబద్ధమని ఏపీ తెలిపింది.నిబంధనలకు విరుద్ధంగా టీఎస్ జెన్కో చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిని నిలిపేసేలా ఆదేశాలివ్వాలని ఏపీ ప్రభుత్వం కోరింది.