Site icon vidhaatha

పోలవరం కాఫర్ ఢ్యాం ఢయా ప్రంవాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన మేఘా..

విధాత‌:పోలవరం ప్రాజెక్టు దిగువ కాఫర్ ఢ్యాం ఢయా ప్రంవాల్ నిర్మాణానికి శ్రీకారం. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి సోమవారం పనులు ప్రారంభించిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్ , జలవనరుల శాఖ డిఈఈ ఎం కె డి వి ప్రసాద్ తదితరులు.

96 మీటర్ల పొడవు,10మీటర్ల లోతు,1.2మీటర్ల వెడల్పుతో ఢయా ప్రం వాల్ నిర్మాణ పనులు ప్రారంభించిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ.దిగువ కాఫర్ ఢ్యాం నిర్మాణ పనులను వేగవంతం. దిగువ కాఫర్ ఢ్యాం పొడవు 1613మీటర్లు,30.5మీటర్ల ఎత్తు.దిగువ కాఫర్ ఢ్యాం లో 63000 క్యూబిక్ మీటర్ల రాక్ ఫిల్లింగ్ పనులు పూర్తి. దిగువ కాఫర్ ఢ్యాం దగ్గర నదిలో గ్యాప్ లను పూడ్చేందుకు ఏర్పాట్లు ముమ్మరం.

దిగువ కాఫర్ ఢ్యాం నిర్మాణం పై ప్రత్యేక దృష్టి సారించిన జలవనరుల శాఖ, మేఘా ఇంజనీరింగ్ అధికారులు. ఎగువ,దిగువ కాఫర్ ఢ్యాంల నిర్మాణం అనంతరం ఎర్త్ కం రాక్ ఫిల్ ఢ్యాం నిర్మాణం పై దృష్టి . ఈ రెండు డ్యాంల నిర్మాణం పూర్తి అవ్వగానే ఈసిఆర్ఎఫ్ పనులు మొదలుపెట్టేందుకు ప్రణాళికలు.ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తిచేసేలా చురుకుగా సాగుతున్న పోలవరం ప్రాజెక్టుపనులు.

Exit mobile version