Site icon vidhaatha

మంగళగిరి సీఐడీ కార్యాలయంలో ఆరు గంటలుగా టీడీపీ నేత

మాజీమంత్రి దేవినేని ఉమను అధికారులు ప్రశ్నిస్తున్నారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు, వీడియో మార్ఫింగ్‌పై సీఐడీ ప్రశ్నించినట్లు సమాచారం. ప్రెస్‌మీట్‌లో దేవినేని ఉమ ఉపయోగించిన సెల్‌ఫోన్‌, ట్యాబ్‌ ఎక్కడని అధికారులు అడిగారు.

సంతృప్తి చెందకపోతే శుక్రవారం కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఉదయం 10.30కి మంగళగిరి సీఐడీ కార్యాలయంలో దేవినేని విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం సీఐడీ హెడ్ క్వార్టర్‌లో ఆయన విచారణకు హాజరయ్యారు.

Exit mobile version