Site icon vidhaatha

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం మరో పిటిషన్‌

విధాత,అమరావతి : సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం మరో పిటిషన్ వేసింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి భూముల కొనుగోలులో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును జగన్ సర్కార్ సుప్రీంలో సవాల్‌ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఇవాళ విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

Exit mobile version