Vishwambhara | మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం విశ్వంభర. ఈ చిత్రం మెగాస్టార్కు 156వ చిత్రం కావడం విశేషం. సోషల్ ఫాంటసీ చిత్రానికి విశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా ఎవరిని తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించాయి. తాజాగా హీరోయిన్గా ఎవరిని తీసుకుంటారనే తేలిపోయింది. చిరంజీవితో త్రిష మరోసారి జతకట్టబోతున్నది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా సోమవారం చిరంజీవి ఆఫీషియల్గా అనౌన్స్ చేశారు. త్రిష విశ్వంభర సెట్స్లో అడుగుపెట్టిన ఆయన షేర్ చేయగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గతంలో చిరంజీవి, త్రిష 2006లో స్టాలిన్ చిత్రంలో కలిసి నటించారు. మళ్లీ 17 సంవత్సరాల తర్వాత ఈ జోడీ బిగ్ స్క్రీన్పై అలరించబోతున్నది. ప్రస్తుతం మూవీ షూటింగ్ హైదరాబాద్లో ప్రత్యేకంగా వేసిన సెట్లో చిత్రీకరించనున్నారు. ఈ నెల 9 నుంచి సాంగ్ షూట్ చేయనున్నట్లు తెలుస్తున్నది. ఫాంటసీ అడ్వెంచర్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. ఇదిలా ఉండగా.. త్రిష పొన్నియన్ సెల్వన్ సిరీస్లో నటించింది. చివరగా లియోలో విజయ్ సరసన నటించింది.