Site icon vidhaatha

Actor Sumalatha | దర్శన్‌ నాకు కొడుకుతో సమానం.. నటి సుమలత లేఖ వైరల్‌

Actor Sumalatha : రేణుకాస్వామి హత్య కేసులో నిందితులైన కన్నడ సీనీ హరో దర్శన్‌, నటి పవిత్ర బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. ఈ కేసులో నటుడు దర్శన్‌ A2గా, నటి పవిత్ర A1గా విచారణ ఎదుర్కొంటున్నారు. కేసులో ఇప్పటివరకు మొత్తం 17 మందిని అరస్ట్‌ చేసి జైల్లో పెట్టారు. కాగా ఇప్పటికే దర్శన్‌ అరెస్ట్‌ విషయంలో చాలామంది నటీనటులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. దర్శన్‌తో సన్నిహిత సంబంధాలున్న రాజకీయ నాయకురాలు, సినీ నటి సుమలత అంబరీష్ స్పందన గురించి చాలామంది ఎదురుచూసినా ఇన్నాళ్లు ఎలాంటి స్పందన రాలేదు.

ఈ క్రమంలో ఎట్టకేలకు నటి సుమలత స్పందించారు. ‘నేను 44 ఏళ్ల నుంచి సినిమా రంగంలో నటిగా, కళాకారిణిగా జీవిస్తున్నా. ఐదేళ్లపాటు ఎంపీగా పనిచేశా. అనేక బాధ్యతలు నిర్వర్తించా. అనవసరంగా వ్యాఖ్యలు చేయడం వృథా. నా కుటుంబంతో దర్శన్ కుటుంబానికి మధ్య ఉన్న బంధం మీకు అర్థం కాదు. అతను స్టార్ కాకముందు 25 ఏళ్లుగా నాకు తెలుసు. స్టార్‌డమ్‌కి మించి దర్శన్ నాకు కుటుంబ సభ్యుడు, కొడుకు లాంటివాడు. అంబరీష్‌ని ఎప్పుడూ నాన్నగా పిలిచే అతని జీవితంలో నాకు ప్రత్యేక స్థానం ఇచ్చాడు. ఏ తల్లి తన కొడుకుని ఇలాంటి పరిస్థితిలో చూడడానికి ఇష్టపడదు. నాకు తెలిసిన దర్శన్ ఎప్పుడూ ఇలాంటి నేరం చేయడు. దర్శన్‌ ప్రేమ, ఉదార హృదయం ఉన్న వ్యక్తిగా నాకు తెలుసు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలనే సంకల్పం అతని పాత్రకు సాక్ష్యమిస్తున్నాయి. దర్శన్ అలాంటి నేరం చేసే వ్యక్తి కాదని నేను నమ్ముతున్నా.’ అంటూ సుమలత లేఖ రాశారు. ఈ విషయం కోర్టులో ఉన్నందున తాను ఇంతకుమించి వ్యాఖ్యానించన పేర్కొన్నారు.

దర్శన్ భార్య విజయలక్ష్మి, కుమారుడు వినీష్‌పై విమర్శలు వ్యక్తం చేస్తున్న వారిని సుమలత తప్పుబట్టారు. అలాంటి వారిని విమర్శిస్తూ సుమలత తన లేఖను ముగించారు. ‘దర్శన్ ఇప్పటికీ నిందితుడు మాత్రమే. అతనికి వ్యతిరేకంగా ఏదీ నిరూపించబడలేదు. అతను శిక్షించబడలేదు. కేసులో న్యాయమైన విచారణ జరగనివ్వండి. దర్శన్‌ కుటుంబ సభ్యులపై అసభ్యంగా మాట్లాడకండి. దర్శన్‌ విషయం వల్ల ఇప్పటికే శాండల్‌వుడ్‌ స్థంభించిపోయింది.’ అని లేఖలో రాశారు.

కాగా రేణుకాస్వామి హత్య కేసులో అరైస్టె జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న హీరో దర్శన్‌, అనుచరులకు కోర్టు కస్టడీ పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. దర్శన్‌, నటి పవిత్ర, మరో 15 మంది నిందితులకు కస్టడీ గడువు ముగియడంతో వీడియో కాన్ఫరెస్స్‌ ద్వారా జడ్జి ముందు హాజరుపరిచారు. ఇందులో నలుగురు నిందితులు తుమకూరు జైల్లో ఉన్నారు. బెయిలు దక్కుతుందని ఆశించిన దర్శన్‌ గ్యాంగ్‌కి నిరాశ ఎదురైంది. వారికి జూలై 18 వరకు కస్టడీని పొడిగిస్తూ జడ్జి ఆదేశాలిచ్చారు.

Exit mobile version