Meera Vasudevan | ముచ్చటగా మూడోసారి మనువాడిన తెలుగు హీరోయిన్‌ మీరా వాసుదేవన్‌..!

Meera Vasudevan | ప్రముఖ నటి మీరా వాసుదేవన్‌ ముచ్చటగా మరోసారి పెళ్లిపీటలెక్కారు. కెమెరామెన్‌ విపిన్‌ పుత్యాంగంను పెళ్లాడారు. ఈ విషయాన్ని మీరా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. అయితే, పెళ్లి జరిగిన నెల రోజుల తర్వాత ఈ విషయాన్ని ఆమె బయటపెట్టింది.

  • Publish Date - May 26, 2024 / 08:30 AM IST

Meera Vasudevan | ప్రముఖ నటి మీరా వాసుదేవన్‌ ముచ్చటగా మరోసారి పెళ్లిపీటలెక్కారు. కెమెరామెన్‌ విపిన్‌ పుత్యాంగంను పెళ్లాడారు. ఈ విషయాన్ని మీరా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. అయితే, పెళ్లి జరిగిన నెల రోజుల తర్వాత ఈ విషయాన్ని ఆమె బయటపెట్టింది. ఏప్రిల్‌ 21న కోయంబత్తూరులో పెళ్లి జరిగిందని.. రిజిస్టర్‌ ప్రక్రియ ఈ రోజు పూర్తయ్యిందంటూ ఫొటోలను షేర్‌ చేసింది. భర్త వివరాలను వెల్లడించింది. విపిన్‌ కేరళలోని పాలక్కడ్‌కు చెందినవారు కాగా.. సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. పలు అంతర్జాతీయ అవార్డులను సైతం గెలుచుకున్నారు.

మీరా, విపిన్‌ ఓ ప్రాజెక్టు కోసం 2019 మే నుంచి కలిసి పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పేమ చిగురించిందని.. గతేడాది కలిసి జీవించాలని నిర్ణయించి వచ్చి.. ఈ ఏడాది ఒక్కటయ్యామని తెలిపింది. ఇరు కుటుంబాలు సహా కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి జరిగిందని మీరా తెలిపింది. ఇదిలా ఉండగా.. మీరా వాసుదేవన్‌ 2001లో సీనియర్‌ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ‘గోల్‌మాల్‌’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అంజలి ఐ లవ్‌ యూ అనే చిత్రంలోనూ మెరిసింది. తమిళ, హిందీ, మలయాళ భాషల్లోనూ హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం పలు మలయాళ చిత్రాల్లో నటిస్తున్నది.

ఇక మీరా వ్యక్తిగత విషయానికి వస్తే.. ఇంతకు ముందు ఆమె రెండు పెళ్లి చేస్తుకున్నారు. మొదట ప్రముఖ సినిమాటోగ్రఫర్‌ అశోక్‌ కుమార్‌ కొడుకు విశాల్‌ అగర్వాల్‌ని 2005లో మనువాడింది. పెళ్లయిన ఐదేళ్లకు విడాకులు తీసుకున్నారు. మళ్లీ 2012లో మలయాళ నటుడు జాన్‌ కొక్కెన్‌ను పెళ్లి చేసుకున్నది. ఈ జంటకు ఓ కొడుకు సైతం ఉన్నాడు. ఏమైందో తెలియదు కానీ 2006లో విడిపోయారు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటుంది. ఈ క్రమంలో ‘కుడుంబవిలక్కు’ అనే సీరియల్‌ షూటింగ్‌లో కెమెరామన్‌ విపిన్‌తో ప్రేమలో పడింది. తాజాగా పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు.

Latest News