విధాత, హైదరాబాద్ : ప్రేమించి పెళ్లి చేసుకుని తనను వదిలేసి మోసం చేశాడంటూ సినీ నటుడు రాజ్ తరుణ్పై ప్రేయసి లావణ్య శుక్రవారం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను ప్రేమించి.. శరీరకంగా వాడుకొని వేరే అమ్మాయితో తిరుగుతున్నాడంటూ లిఖితపూర్వకంగా లావణ్య పోలీసుల ఫిర్యాదులో పేర్కోంది. 11 ఏళ్లుగా రాజ్తరుణ్తో రిలేషన్షిప్లో ఉన్నానని.. గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని తెలిపింది. ప్రస్తుతం తన సినిమాలో(తిరుగబడ్డరా సామీ) నటిస్తున్న హీరోయిన్ మాల్వీ మల్హోత్రతో అఫైర్ పెట్టుకొని నన్ను వదిలేశాడని ఆరోపించింది. రాజ్ మూడు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి నాకు దూరంగా ఉంటున్నాడని, రాజ్ను వదిలేయకపోతే మాల్వీ మల్హోత్ర, ఆమె సోదరుడు మయాంక్ మల్హోత్రలు నన్ను చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కోంది. గతంలో నన్ను డ్రగ్స్ కేసులో కావాలనే ఇరికించారని, అరెస్టై 45 రోజులు జైల్లో ఉన్నప్పటికి రాజ్ నాకు ఎలాంటి సాయం చేయలేదని వాపోయింది. రాజ్ తరుణ్ నా ప్రపంచం..రాజ్ నాకు కావాలని తనకు న్యాయం చేయాలని ఆమె పోలీసులను అభ్యర్థించింది.
మోసం చేసిందే ఆమే : రాజ్ తరుణ్
తనపై లావణ్య పెట్టిన పోలీస్ కేసుపై హీరో రాజ్ తరుణ్ స్పందించారు. అసలు మోసం చేసిందే లావణ్య అని ఆరోపించారు. మా మధ్య ఒకప్పుడు రిలేషన్ ఉన్నది నిజమేనని, తామిద్దరం గుళ్లో పెళ్లి చేసుకున్నాం అన్నది పచ్చి అబద్దం అని చెప్పారు. ఆమె చెప్పేవి అన్ని అబద్దాలని కొట్టిపారేశారు. లావణ్య డ్రగిస్టని, బ్లాక్ మెయిలర్ అని ఆరోపించారు. తన జీ మెయిల్ కూడా హ్యాక్ చేసిందని చెప్పారు. నన్నే కాదు వాళ్ల నాన్నను కూడా ఇబ్బందులకు గురి చేసిందని తెలిపారు. ఆమెపై మూడు డ్రగ్ కేసులు నమోదు అయ్యాయన్నారు. నేను ఆమెను డ్రగ్ కేసులో ఇరికించే ప్రయత్నం చేయలేదని స్పష్టం చేశారు. ఆమె పెట్టే టార్చర్ భరించలేకే దూరంగా ఉంటున్నానని తెలిపారు. ఈ విషయంపై డీసీపీని కలిసి మాట్లాడానని, నేను లీగల్గా అప్రోచ్ అవుతున్నానన్న ఉద్ధేవంతో ముందుగానే ఆమె నాపై కేసు పెట్టిందని, కావాలనే రాద్ధాంతం చేస్తూ నా కెరీర్ను నాశనం చేయాలని ప్రయత్నిస్తోందని రాజ్ తరుణ్ ఆరోపించారు.