Pawan Kalyan| పవన్ కళ్యాన్ ఒకప్పుడు సినిమా నటుడు. ఆయన ఏం చేసిన కూడా జనాలు పెద్దగా విమర్శలు చేసే వారు కాదు. ఆయన ఇప్పుడు ఆయన నటుడితో పాటు రాజకీయ నాయకుడిగా కూడా ఉన్నారు. జనసేన పార్టీ అధినేతగా ఉన్న పవన్ని పదే పదే పెళ్లిళ్ల విషయంతో టార్గెట్ చేస్తున్నారు. జగన్ అయితే ఏకంగా పవన్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇక ఇటీవల పవన్ తన మూడో భార్య నుండి విడాకులు తీసుకున్నాడని జోరుగా ప్రచారాలు చేశారు. ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయని, దీంతో ఈ ఇద్దరు విడిపోతున్నారని, కోపంతో అన్నా లెజీనోవా రష్యా వెళ్లినట్టు కూడా వార్తలు వచ్చాయి.
పవన్ నాలుగో పెళ్లికి కూడా సిద్ధమయ్యారంటూ ప్రచారాలు చేశారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తన భార్యని పబ్లిక్లోకి తీసుకొచ్చి అందరి నోళ్లు మూయిస్తున్నాడు. మంగళగిరిలో ఓటు వేయడానికి వచ్చినప్పుడు పవన్ తన భార్య అన్నా లెజినోవాతో కలిసి వచ్చాడు. దీంతో పుకార్లు పుట్టించిన వారికి నోట మాట రాలేదు. వారిద్దరు సంతోషంగా ఉన్నారని, విడాకులు అనే వార్తలు అవాస్తవం అని తేలిపోయింది. మోడీ వారణాసి నామినేషన్స్ సందర్భంగా, పవన్ తన భార్యతో అక్కడికి వెళ్లారు.. అనంతరం సతీసమేతంగా కాశీ విశ్వనాథుని ఆలయానికి వెళ్లిపూజలు, అభిషేకం చేశారు.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అటవీశాఖా మంత్రి అరుణ్ కుమార్ దగ్గరుండి ఉండి మరీ పవన్ దంపతులకి ఆలయాన్ని చూపించారు. అయితే అక్కడ కూడా పవన్కి అశేష ఆదరణ దక్కింది. చూస్తుంటే దేశ రాజకీయాల్లోనూ పవన్ కీలకంగా మారుతున్నట్టు కనిపిస్తుంది. ఈ క్రమంలో తనవైపు నుండి ఎలాంటి రిమార్క్ లేకుండా ఉండేందుకు పవన్ కళ్యాణ్ ఇలా తన భార్యతో పబ్లిక్లో తిరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే పవన్, అన్నా లెజినోవా మధ్య గొడవలు ఉన్న మాట నిజమేనట. ఆమె రష్యా వెళ్లిపోయిన మాట నిజమే అని, కాకపోతే ఆ సమస్యలను పవన్ సెటిల్ చేసుకున్నారని ఇన్సైడ్ టాక్.