Prabhas| ప్ర‌భాస్ న్యూ లుక్.. హాలీవుడ్ హీరోని మించి ఉన్నావుగా బాసు..!

Prabhas| బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్ ప్ర‌స్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్నాడు. అయితే వ‌రుస

  • Publish Date - April 24, 2024 / 07:01 AM IST

Prabhas| బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్ ప్ర‌స్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్నాడు. అయితే వ‌రుస ఫ్లాపులు ప‌ల‌క‌రించిన కూడా ప్ర‌భాస్ ధైర్యంగా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే స‌లార్ అనే మూవీతో పెద్ద హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో క‌ల్కి సినిమా చేస్తున్నాడు. ఈ మూవీతో పాటు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రాజా సాబ్ చేస్తున్నాడు. ఆ త‌ర్వాత సందీప్ రెడ్డి వంగాతో ఓ మూవీ చేయ‌నున్నాడు. అయితే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ మూవీని ‘కల్కి 2898 ఏడి’ చిత్రంలో హిందూ పురాణాల్లో చెప్పబడిన కొన్ని ముఖ్య పాత్రలని సూపర్ హీరోలుగా చిత్రీకరిస్తూ ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఇటీవ‌ల అమితాబ్‌కి సంబంధించిన గ్లింప్స్ విడుద‌ల కాగా, ఇది ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. అయితే ప్ర‌భాస్ లుక్ ఎలా ఉంటుందా అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌భాస్ న్యూ లుక్‌కి సంబంధించిన ఫొటో ఒక‌టి నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఎవరూ ఊహించని విధంగా సరికొత్త అవతారంలో ప్ర‌భాస్ కనిపించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు. లాంగ్‌ హెయిర్‌తో ఉన్న ప్రభాస్ ని చూసి అచ్చం హాలీవుడ్ హీరో మాదిరిగా ఉన్నాడు క‌దా అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే స‌డెన్‌గా ప్ర‌భాస్ ఈ లుక్‌లోకి మార‌డం వెనుక సీక్రెట్ ఏంటనేది మాత్రం తెలియాల్సి ఉంది. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర‌గా రూపొందుతున్న క‌ల్కి సినిమాలో దీపికా క‌థానాయిక‌గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, లెజెండరీ యాక్టర్లు కమల్‌ హాసన్‌, రాజేంద్రప్రసాద్‌, పశుపతి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ రీసెంట్‌గా హెడ్‌లైన్స్‌లోకి ఎక్కాడు. తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్‌(టీఎఫ్‌డీఏ)కు ఏకంగా రూ. 35 లక్షల విరాళం ప్రకటించారు. దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా మే 4న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు ఫిలిం డైరెక్టర్స్ ఓ కార్యక్రమాన్ని నిర్వహించనుండ‌గా, ఈ కార్య‌క్ర‌మం కోసం భారీ విరాళం ప్ర‌క‌టించి త‌న మంచి మ‌న‌సు చాటుకున్నారు.

Latest News