Rashmi| ర‌ష్మీ ఏంటి అలా అనేసింది.. అంద‌రి ముందే నూక‌రాజుని చెప్పుతో కొడ‌తానంటూ వార్నింగ్

Rashmi| బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచుతున్న కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్. ఈ కార్యక్రమం రెండు భాగాలుగా కొన్నాళ్ల‌పాటు అల‌రించింది. అయితే ఇటీవ‌ల ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ధ‌స్త్‌కి చెక్ పెట్టి జ‌బ‌ర్ధ‌స్త్‌ని రెండు రోజుల పాటు ప్ర‌సారం చేస్తున్నారు. తాజాగా లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేయ‌డం జ‌రిగింది.ఇందులో ర‌ష్మి.. నూక‌రాజుని చెప్పుతో క‌డ‌తాననే స‌రికి అంద‌రు షాక‌య్యారు. నూక‌రాజు.. ర‌ష్మీని చూస్తూ..ఏం రష్మీ... ఎలా ఉన్నావ్ అని అడిగాడు. దా

  • Publish Date - June 20, 2024 / 07:57 AM IST

Rashmi| బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచుతున్న కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్. ఈ కార్యక్రమం రెండు భాగాలుగా కొన్నాళ్ల‌పాటు అల‌రించింది. అయితే ఇటీవ‌ల ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ధ‌స్త్‌కి చెక్ పెట్టి జ‌బ‌ర్ధ‌స్త్‌ని రెండు రోజుల పాటు ప్ర‌సారం చేస్తున్నారు. తాజాగా లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేయ‌డం జ‌రిగింది.ఇందులో ర‌ష్మి.. నూక‌రాజుని చెప్పుతో క‌డ‌తాననే స‌రికి అంద‌రు షాక‌య్యారు. నూక‌రాజు.. ర‌ష్మీని చూస్తూ..ఏం రష్మీ… ఎలా ఉన్నావ్ అని అడిగాడు. దానికి ‘నేను బాగానే వున్నాను కానీ… ఏంటి కామెడీ వుంటుందా? అని ర‌ష్మీ ప్ర‌శ్నించింది. అప్పుడు నూక‌రాజు ఏమి విన‌ప‌డ‌న‌ట్టు యాక్ట్ చేశాడు. దాంతో మ‌రోసారి ‘స్కిట్టులో కామెడీ వుంటుందా’ అని మళ్ళీ ప్రశ్నించింది. మ‌ళ్లీ ఏం విన‌పడ‌నట్టే చేసి.. ‘ఆ’ అంటూ నూకరాజు పక్క‌కి తిరిగాడు.

అప్పుడు ర‌ష్మీ.. ‘సరే ఇటు రా ముద్దు పెడతా’ అని అన‌డంతో అప్పుడు వ‌స్తున్నా అని ఆశ‌గా ఆమె వైపు రాబోయాడు నూకరాజు. దాంతో ర‌ష్మీ.. ‘చెప్పు తీసుకుని కొడతా’ అని సీరియస్ అవ్వడంతో వెనక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు అక్క‌డ ఉన్న‌ కృష్ణ భగవాన్, ఖుష్బూల‌తో పాటు అంద‌రు న‌వ్వుకున్నారు. ఇక లేటెస్ట్ ప్రోమోలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ ల‌ని వాడేస్తూ అద‌రిపోయే పంచ్‌లు వేశారు. రెండు వ‌ర్గాల మ‌ధ్య బెట్ పెట్టుకోగా, ఈ క్ర‌మంలో ‘మా పది వేలు పోయినందుకు మేం ఫీల్ కావడం లేదు. ఈ రోజుతో బెట్ ఆపేద్దాం’ అని బుల్లెట్ భాస్కర్ అన్నాడు. అప్పుడు ‘ఏం భయపడ్డవా?’ అని ఆటో రామ్ ప్రసాద్ అడుగుతాడు. దానికి ‘9, 9 మార్కులు తెచ్చుకున్న నేను ఐదు వేలు పోగొట్టుకోవడం ఏమిటి? 5, 5మార్కులు తెచ్చుకున్న రాకెట్ రాఘవ ఐదు వేలు గెలుచుకోవడం ఏమిటి?’ అని అంటాడు భాస్క‌ర్.

అప్పుడు కెవ్వు కార్తీక్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పట్నించీ ఒక లెక్క. ఇంతకు ముందు గెలవడం కాదు, ఇప్పుడు గెలిచి చూపించండి’ అని అన‌డంతో.. ‘నువ్వు ఎంతైనా పోటీ పడు. విజయం మాదే” అని నారా చంద్రబాబు నాయుడు తరహాలో ‘వి’ సింబల్ చూపిస్తాడు ఆటో రామ్ ప్రసాద్. ఆ తర్వాత ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అని పవన్ డైలాగ్ వినిపిస్తుంది. ఆ త‌ర్వాత మిగ‌తా కంటెస్టెంట్స్ కూడా త‌మ స్కిట్స్‌లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. ఫుల్ ఎపిసోడ్ ప్రేక్ష‌కుల‌కి మంచి కిక్ ఇస్తుంద‌ని నెటిజన్స్ భావిస్తున్నారు

Latest News