Samantha| టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత- నాగ చైతన్య జంట ఊహించని విధంగా విడిపోయి ఎవరి జీవితం వారు గడుపుతున్నారు. వాస్తవానికి ఈ జంట తమ తొలి చిత్రం ఏమాయ చేశావే సమయంలోనే ప్రేమలో పడిన ఆ విషయాన్ని చాలా కాలం సీక్రెట్గా ఉంచారు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఇంట్లో వాళ్లకి చెప్పి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. సమంత అక్కినేని వారి కోడలిగా మారడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. ఇక ఈ జంటని చూసి పొగడిన వారే తప్ప విమర్శించిన వారే లేరు. అయితే వీరిద్దరికి జిష్టి తగిలిందో ఏమో కాని ఊహించని విధంగా విడాకులు తీసుకున్నారు. కాపురం మూడునాళ్ల ముచ్చటైంది. ఇక విడాకులు తీసుకుని ప్రస్తుతం ఒంటరి జీవితం గడుపుతున్నారు.
అయితే విడాకుల తర్వాత సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడడం, సినిమాలకి బ్రేక్ ఇచ్చి కొన్నాళ్లపాటు ట్రీట్మెంట్ తీసుకోవడం మనం చూసాం. అయితే ఇప్పుడు కాస్త కోలుకోవడంతో తిరిగి సినిమాలు చేయాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే `మా ఇంటి బంగారం` పేరుతో మూవీని తన బర్త్ డే రోజు అనౌన్స్ చేశారు సమంత. ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ కాగా, ఈ సినిమా మంచి కథతో రూపొందనున్నట్టు తెలుస్తుంది. అయితే సమంత, నాగ చైతన్య విడిపోయి చాలా రోజులే అవుతున్నా కూడా వారి విడాకులకి సంబంధించి నెట్టింట అనేక వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. ఏదో కారణాన్ని చూపిస్తూ సోషల్ మీడియాలో పలు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే కొద్ది రోజుల క్రితం తీన్మార్ మల్లన్న ఫోన్ ట్యాపింగ్ వలన నాగ చైతన్య, సమంత విడిపోయారంటూ బాంబ్ పేల్చాడు. కేటీఆర్ తెరవెనుక ఇదంతా చేయించారని ఆయన ఆరోపణ చేశారు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తావన కూడా తీసుకురావడం జరిగింది. కట్ చేస్తే బీజేపీ భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ .. సమంత, నాగచైతన్యల విడాకుల మ్యాటర్ ఫోన్ ట్యాపింగ్కి ముడిపెట్టారు. దీంతో ఈ విషయం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్గా మారింది. మీడియాతో మాట్లాడిన ఆయన ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమంత, నాగచైతన్య విడిపోయారని ఆయన ఆరోపించారు. ఈ కేసుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని, సీఎం రేవంత్రెడ్డి ఏం చేస్తున్నాడని బూర నర్సయ్య గౌడ్ ప్రశ్నించారు. మరో నాయకుడు సమంత, నాగ చైతన్యల విడాకులు ఫోన్ ట్యాపింగ్ వల్లే వచ్చాయని అనడంతో ఇప్పుడు ఈ విషయం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.