విధాత:‘సర్కారువారి పాట’ తాజా షెడ్యూల్ గోవాలో ఓ ఫైట్తో మొదలైంది. మహేశ్బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో కీర్తీ సురేష్ కథానాయిక. గోవా షెడ్యూల్లో ముందు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ను ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ సమకూర్చుతున్నారు. ఈ సందర్భంగా లొకేషన్ వర్కింగ్ స్టిల్ను విడుదల చేసింది చిత్రబృందం.
ఈ యాక్షన్ సీక్వెన్స్ పూర్తయ్యాక కొంత టాకీ పార్టును కూడా షూట్ చేస్తారు.ఈ షెడ్యూల్లో మహేశ్బాబుతో పాటు కీలక తారాగణం పాల్గొంటారు.నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట,మహేశ్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 13న విడుదల కానుంది.ఈ సినిమాకు సంగీతం:తమన్,లైన్ప్రొడ్యూసర్: రాజ్కుమార్.