Sreeleela | విజయ్‌ దేవరకొండ సినిమా నుంచి శ్రీలీల అవుట్‌..! ఆ ఇద్దరు యంగ్‌ బ్యూటీల్లో ఛాన్స్‌ కొట్టేసేదెవరు..?

  • Publish Date - April 10, 2024 / 08:00 AM IST

Sreeleela | విజయ్‌ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్‌’ మూవీతో ఇటీవల థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం సినిమాకు పాజిటివ్‌ టాక్‌ నడుస్తున్నది. ఈ చిత్రం తర్వాత విజయ్‌ దేవరకొండ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతకాంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రం పూజా కార్యక్రమంలో గ్రాండ్‌గా లాంచ్‌ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీలను ఎంపిక చేశారు. మూవీ లాంచ్‌లో యంగ్‌ బ్యూటీ సైతం పాల్గొన్నారు. అయితే, ఈ సినిమా నుంచి శ్రీలీల తప్పుకున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌ నడుస్తున్నది.

అయితే, నిర్మాత నాగవంశీ మాత్రం వార్తలను కొట్టిపడేశారు. అయితే, శ్రీలీల నుంచి సినిమా నుంచి తప్పించినట్లు గట్టిగానే వార్తలు వస్తున్నాయి. ఆమె ప్లేస్‌లో మరో ఇద్దరు హీరోయిన్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. శ్రీలీల చివరిగా తెరపై సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు నటించిన ‘గుంటూరు కారం’లో నటించింది. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది. ఈ మూవీ కోసం శ్రీలీల తన పరీక్షలకు సైతం డుమ్మా కొట్టింది. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్‌ ఇచ్చి చదువుపై ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో మలయాళీ సంచలనం మమితా బైజును తీసుకున్నట్లు టాక్‌ నడుస్తున్నది. ఇటీవల ‘ప్రేమలు’తో తెలుగు ఆడియన్స్‌కు మమితా బైజు దగ్గరైంది. తనదైన నటనతో కుర్రాళ్ల మనసుల్లో నిలిచిపోయింది.

ప్రస్తుతం ఈ బ్యూటీకి మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది. ఈ క్రమంలో మమితాను హీరోయిన్‌గా తీసుకున్నారని టాక్‌ నడుస్తున్నది. అదే సమయంలో మరో యంగ్‌ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే పేరును సైతం పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ బ్యూటీ మాస్‌ మహారాజ్‌ రవితేజ హీరోగా నటించిన ‘మిస్టర్‌ బచ్చన్‌’తో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది మరాఠా చిన్నది. అయితే, ఇద్దరిలో ఎవరిని హీరోయిన్‌గా తీసుకున్నారనేది తెలియరాలేదు. అయితే, శ్రీలీలనే విజయ్‌తో జత కడుతుందా..? లేదంటే మమితా బైజు, భాగ్యశ్రీ బోర్సే ఇద్దరిలో ఎవరు రౌడీ సినిమాలో నటిస్తారో త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది.

Latest News