Actor Ali | రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన అలీ..! నేను కామన్‌ మెన్‌ అంటూ వీడియో రిలీజ్‌ చేసిన స్టార్‌ కమెడియన్‌..!

Actor Ali | టాలీవుడ్ స్టార్ కమెడియన్‌ అలీ రాజకీయాలకు వీడ్కోలు పలికారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తాను ప్రస్తుతం ఏ పార్టీకి చెందిన వాడిని కాదని.. కేవలం సామాన్యుడినేనని తెలిపారు. ఇప్పటి నుంచి సినిమాల్లో నటించనున్నట్లు తెలిపారు. తాను డాక్టర్‌ డీ రామానానాయుడు కోసం రాజకీయాల్లోకి వచ్చానన్నారు. బాల బాలనటుడిగా అనేక సినీరంగ ప్రవేశం చేశానన్నాడు.

  • Publish Date - June 29, 2024 / 12:10 AM IST

Actor Ali | టాలీవుడ్ స్టార్ కమెడియన్‌ అలీ రాజకీయాలకు వీడ్కోలు పలికారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తాను ప్రస్తుతం ఏ పార్టీకి చెందిన వాడిని కాదని.. కేవలం సామాన్యుడినేనని తెలిపారు. ఇప్పటి నుంచి సినిమాల్లో నటించనున్నట్లు తెలిపారు. తాను డాక్టర్‌ డీ రామానానాయుడు కోసం రాజకీయాల్లోకి వచ్చానన్నారు. బాల బాలనటుడిగా అనేక సినీరంగ ప్రవేశం చేశానన్నాడు. ఓ వయసు వచ్చాక ప్రేమఖైదీ చిత్రం ద్వారా అవకాశం ఇచ్చి తనను నటుడిగా నిలబెట్టిన వ్యక్తి రామానాయుడు అన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందిన తర్వాత.. ప్రేమఖైదీ చిత్రంతో నా కెరీర్‌లో మరో అధ్యాయం మొదలైందని తెలిపారు. రామానాయుడు బాపట్ల నుంచి ఎంపీగా పోటీ చేస్తూ.. ‘నువ్వు కూడా రావాలి రా అనడంతో ఆనాడు ఆయన కోసం రాజకీయాల్లోకి మీ కోసం తప్పకుండా వస్తాను గురువు గారూ! మీ సినిమా ప్రేమ ఖైదీ తర్వాతే.. మళ్లీ ఒక ఆర్టిస్ట్‌గా మరో మెట్టుకు ఎదిగాను.. మీ కోసం తప్పకుండా వస్తాను’ అని చెప్పి టీడీపీ హయాంలో రాజకీయాల్లోకి ప్రవేశించినట్లు తెలిపారు. దాదాపు 20 సంవత్సరాలు ఒకే పార్టీలో కొనసాగానని.. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీలోకి వచ్చానన్నారు.

తనకు మొదట అన్నం పెట్టింది తెలుగు చిత్ర పరిశ్రమ, తెలుగు ప్రేక్షక దేవుళ్లు, నా నిర్మాతలు, నా దర్శకులు, నా హీరోలు అని.. ఈ రోజున ఈ స్థాయికి ఎదిగానన్నారు. 45 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నానని.. దాదాపు ఆరు భాషల్లో 1200 పైచిలుకు సినిమాలు చేశానన్నారు. నాకు దయాగుణం ఉందని.. కాబట్టి రాజకీయ బలం కూడా తోడైతే పది మందికి సాయపడగలననే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానని.. అంతే తప్ప రాజకీయాలు చేయాలని మాత్రం రాలేదన్నారు. ఇండస్ట్రీ నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చింది.. నేను ఏం చేస్తే బాగుంటుందని అని నలుగురినీ చూసి నేను మా నాన్న గారి పేరు మీద ట్రస్ట్‌ను స్థాపించానన్నారు. గత 16 ఏళ్లుగా ట్రస్టు ద్వారా సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నానన్నారు. కరోనా సంక్షోభ సమయంలోనూ ఆపన్నులను ఆదుకున్నానన్నారు. చుట్టాల్లోనూ, బయటి వాళ్లలోనూ చాలామందిని నేను చదివించానన్నారు. తన ఆదాయంలో 20 శాతం ట్రస్టుకు కేటాయిస్తుంటానని.. విదేశాల్లో ఏదైనా ఈవెంట్లు చేస్తే, వచ్చే ఆదాయంలో 60 శాతం ట్రస్టుకే అందిస్తుంటాననారు. నేను ఏ పార్టీలో ఉన్నా వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించలేదని స్పష్టం చేశారు.

ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గురించే మాట్లాడడానని.. మా పార్టీ ఎమ్మెల్యేలను, మా పార్టీ నాయకుడ్ని పొగుడుతానే తప్ప, ఇతర పార్టీల్లోని నేతలను ఒక మాట అనడం కానీ, వారి వ్యక్తిగత జీవితాలను విమర్శించడం కానీ చేయలేదన్నారు. నేను ఎవరినైనా ఒక్క మాట అన్నట్టు మీకు ఎక్కడా కనిపించదని గుర్తు చేశారు. ఇవాళ నేను మీ ముందుకు రావడానికి కారణం ఏమిటంటే.. ‘నేను ఏ పార్టీ మనిషిని కాదు. ఏ పార్టీ మద్దతుదారుడ్ని కాదు. నేను కేవలం ఒక సాధారణ పౌరుడిని. ఇక నుంచి నేను ఒక సాధారణ మనిషిలాగే ఉండి నా సినిమాలేవో నేను చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ మాట చెప్పడానికే మీ ముందుకు వచ్చాను. ప్రతి ఐదేళ్లకోసారి అందరూ ఎలా వెళ్లి ఓటేసి వస్తారో.. నేను కూడా ఓ సాధారణ పౌరుడిలా వెళ్లి ఓటేసి వస్తాను. ఇంతటితో రాజకీయాలకు స్వస్తి. గుడ్ బై’ అంటూ అలీ ప్రకటించారు. ఇదిలా ఉండగా.. అలీ 2019 వైఎస్సార్‌సీపీ చేరారు. ఆయనకు జగన్‌ ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ మీడియా సలహాదారు పదవి ఇచ్చింది. అయితే, రాజకీయాల నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఇంతకు ముందు ఇద్దరు మంచి స్నేహితులుగా ఉండేవారు. మళ్లీ పవన్‌, అలీ ఇద్దరూ మళ్లీ సినిమాల్లో కలిసి నటిస్తారా? లేదా? వేచి చూడాల్సిందే.

Latest News