2019 లో కోడలు షరీష్మా హత్యకు ప్రతీకారచర్య
విధాత:బ్రహ్మంగారిమఠం మండలం డి.నేలటూరుగ్రామంలో అంజనమ్మ,ఆమె కోడలు లక్ష్మీదేవిలు దారుణ హత్యకుగురయ్యారు.పాత కక్షల వల్లనే అమ్మ, కోడలు హత్యకు గురైనట్లు పోలీసు వర్గాల సమాచారం.అంజనమ్మ కోడలు షరీఫ్మాను వరకట్న వేధింపులో భాగంగా తన కూతురు లక్ష్మిదేవి సహకారంతో 2019లో హత్య చేశారు.షరీష్మా తల్లిదండ్రులు తన కూతురు హత్యకు తల్లికూతుళ్ల పై కేసుపెట్టారు.తన కూతురుని అత్తింట్లోనే సమాధి కట్టించారు.
ఆ హత్య అనంతరం అంజనమ్మ, కూతురు లక్ష్మిదేవి కేసు లో బెయిల్ రావడంతో డి.నేలటూరు గ్రామం కు వెళ్లలేక బ్రహ్మంగారి మఠంలో నివాసం ఉంటున్నారు.శుక్రవారం కేసు పంచాయతీ నేపథ్యంలో గ్రామంకు వెళ్లగా తల్లికూతుళ్లు హత్యకుగురయ్యారు.ప్రతీకార చర్యలో భాగంగా తల్లి కూతుళ్లను హత్య చేసి ఉంటారని పోలీసులు ఆకోణంలో విచారిస్తున్నారు.