Site icon vidhaatha

సైబర్ క్రైం:మీరు మోసపోతే ఈ హెల్ప్ లైన్ నంబర్‌ ను సంప్రదించండి

విధాత:సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి డబ్బులు పోగొట్టుకునే వాళ్ల కోసం కేంద్ర హోంశాఖ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది.155260 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైం అధికారులు తెలిపారు. దీనికి కాల్ చేయగానే సైబర్ నేరగాళ్ల అకౌంట్‌ను హోల్డ్‌లో పెట్టి, మనీ విత్ డ్రా చేయకుండా ఆపవచ్చని చెప్పారు. నగదు వెనక్కి తెచ్చే విధంగా చేయవచ్చన్నారు. ఆలస్యం చేయకుండా వెంటనే కాల్ చేయాలని సూచించారు.

Exit mobile version