విధాత:ఒంగోలు, బేస్తవారపేట,: కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రే కుమార్తెను చెరబట్టాడు. బాలికపై (15) పలుమార్లు అత్యాచారం చేసి అయిదు నెలల గర్భిణిని చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి దూరంగా నివాసం ఉంటున్నాడు. జనవరి నెలలో బాలిక తల్లి సరకుల తీసుకొచ్చేందుకు పక్కనే ఉన్న సంగరపల్లికి వెళ్లింది. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న తండ్రి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
అప్పటి నుంచి పలుదఫాలుగా అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటికి చెబితే తల్లి, కూమార్తెను చంపేస్తానంటూ బెదిరించేవాడు. తరచూ బాలికను కొడుతుండటంతో సుమారు 20 రోజుల కిందట 100 నంబరుకు ఫోన్ చేసింది. పోలీసులు వెళ్లి మందలించారు. ఆ తరువాత బాలిక.. అవ్వ,తాతల ఇంటికి వెళ్లింది. జరిగిన విషయాన్ని వాళ్లకు చెప్పడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.