Site icon vidhaatha

వివేకా హత్య కేసు: కీలక వ్యక్తుల విచారణ

విధాత,కడప:మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ 30వ రోజు కొనసాగుతోంది. నెల రోజుల నుంచి అనుమానితులను ప్రశ్నిస్తున్న అధికారులు ప్రస్తుతం కీలక వ్యక్తుల నుంచి సమాచారాన్ని రాబడుతున్నారు. వివేకా హత్య జరిగిన రోజు సాక్ష్యాలు తారుమారు చేశారని సిట్‌ అరెస్టు చేసిన ఎర్ర గంగిరెడ్డితో పాటు వివేకా పీఏ కృష్ణారెడ్డి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఇదయతుల్లా, డ్రైవర్‌ ప్రసాద్‌, వైకాపా కార్యకర్త కిరణ్‌కుమార్‌ యాదవ్‌ను సీబీఐ అధికారులు మరోసారి ప్రశ్నిస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకూ ఈ ఐదుగురిని పులివెందుల అతిథి గృహంలో విచారించిన అధికారులు ఇవాళ మరోసారి విచారణకు పిలిచారు. ఈ ఉదయం కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహానికి వచ్చిన ఈ ఐదుగురిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Exit mobile version