ఏపీలో అమరావతి నమూనా గ్యాలరీ ధ్వంసం

ఏపీలో రాజధాని అమరావతి నమూనా గ్యాలరీని దుండగులు ధ్వంసం చేశారు. ఉద్దండరాయుని పాలెంలో రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రదేశంలో అమరావతి నమూనా గ్యాలరీని ఏర్పాటు చేశారు

  • Publish Date - April 17, 2024 / 05:51 PM IST

ఎన్నికల వేళ మరో రచ్చ

విధాత : ఏపీలో రాజధాని అమరావతి నమూనా గ్యాలరీని దుండగులు ధ్వంసం చేశారు. ఉద్దండరాయుని పాలెంలో రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రదేశంలో అమరావతి నమూనా గ్యాలరీని ఏర్పాటు చేశారు. అక్కడ ప్రభుత్వ పరంగా ఎలాంటి సెక్యూరిటీ లేకపోవడంతో దుండగులు వాటిని ధ్వసం చేయగలిగారు. అమరావతి ముఖచిత్రం, చారిత్రక ఘట్టాలు, మ్యాప్‌లు, కట్టడాలకు సంబంధించిన నమూనాలు, విశేషాలను తెలిపే బోర్డులను గుర్తుతెలియని దుండగులు పగులగొట్టారు. ఆ ప్రాంగణానికి ఉన్న గేట్లను కూడా గతంలో ఆక్రమార్కులు తొలగించి పక్కన పడేశారు. రాజధాని ప్రాంతంలో ఇప్పటి వరకు రోడ్లను ధ్వంసం చేసి ఇసుక, కంకర, మట్టి, ఇనుము చోరీ చేసిన దుండగులు.. ఇప్పుడు శంకుస్థాపన ప్రాంతాన్ని ధ్వంసం చేయడం దారుణమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Latest News