Nizamabad | అమ్మకానికి కన్న బిడ్డ.. ఒకే బిడ్డకు ఇద్దరితో తల్లి బేరం

ఆస్పత్రి వద్దే గుట్టురట్టు Nizamabad | విధాత ప్రతినిధి, నిజామాబాద్: కన్న బిడ్డను అమ్మకానికి పెట్టింది ఓ తల్లి. పోషించే స్థోమత లేక బేరం కుదుర్చుకుంది. ఐతే ఒకే బిడ్డను ఇద్దరు వ్యక్తులకు అమ్మ చూపడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే, నిజామాబాద్ నగరంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన గోసంగి దేవి వంటల పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. అయితే తనకు పుట్టబోయే బిడ్డను పోషించే స్థోమత లేదని, తన వీధిలో ఉంటున్న ఆశావర్కర్ తో […]

  • Publish Date - September 6, 2023 / 10:47 AM IST

  • ఆస్పత్రి వద్దే గుట్టురట్టు

Nizamabad | విధాత ప్రతినిధి, నిజామాబాద్: కన్న బిడ్డను అమ్మకానికి పెట్టింది ఓ తల్లి. పోషించే స్థోమత లేక బేరం కుదుర్చుకుంది. ఐతే ఒకే బిడ్డను ఇద్దరు వ్యక్తులకు అమ్మ చూపడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే, నిజామాబాద్ నగరంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన గోసంగి దేవి వంటల పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. అయితే తనకు పుట్టబోయే బిడ్డను పోషించే స్థోమత లేదని, తన వీధిలో ఉంటున్న ఆశావర్కర్ తో చెప్పుకుంది.

దీంతో ఆశా వర్కర్ డబ్బు ఆశ చూపింది. పుట్టబోయే బిడ్డను తాను అమ్మి పెడతానని చెప్పడంతో, ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. మగ బిడ్డ పుడితే లక్షా యాభై వేలు, ఆడబిడ్డ పుడితే లక్ష రూపాయల అమ్మకానికి నిర్ణయం చేసుకున్నారు. ఆ మేరకు తల్లి ఐదువేల అడ్వాన్స్ కూడా తీసుకుంది. ఈ క్రమంలో వారం క్రితం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గోసంకి దేవి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆబిడ్డను ఇద్దరికి అమ్మకానికి బేరం కుదుర్చుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

ఇదే విషయమై ఆసుపత్రి వద్ద కొనుగోలు చేసిన ఇద్దరు వ్యక్తులు గొడవ పడ్డారు. పోలీసులు వారిని పట్టుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ఒకే బిడ్డను ఇద్దరికీ అమ్మకానికి పెట్టడం కారణంగా అసలు విషయం బయటపడిందని పోలీసులు తెలిపారు. బిడ్డను అమ్మకానికి పెట్టిన తల్లిపై, కొనడానికి ప్రయత్నం చేసిన ఇద్దరు మహిళలు, మధ్యవర్తిగా వ్యవహరించిన ఆశా వర్కర్ పై కేసు నమోదు చేసి, నలుగురిని పోలీసులు రిమాండ్ కు తరలించారు.

Latest News