Ms Dhoni: క్రికెట్ అభిమానులకి పరిచయం అక్కర్లేని పేరు మహేంద్ర సింగ్ ధోని. భారత క్రికెట్లో ఎన్నో అద్భుతాలు సృష్టించిన ధోని ఇప్పుడు కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లో ధోని మెరుపులు మెరిపించి అభిమానులకి మస్త్ మజా అందించాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడతాడా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ధోని క్రికెట్కి దూరమైన ఆయన అభిమానులు పెరుగుతున్నారే తప్ప తగ్గడం లేదు. మిస్టర్ కూల్ రీసెంట్గా 41సంవత్సరాలు పూర్తి చేసుకొని 42వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ఆయనకి మనదేశం నుండే కాదు విదేశీయులు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంటర్నెట్ అంతా ధోని నామస్మరణతో నిండిపోయింది.
అయితే ధోని తన 42వ బర్త్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడా అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తగా ఎదురు చూశారు. ఈ క్రమంలో ఆయన తన ఇన్స్టాగ్రాములో ఒక వీడియో షేర్ చేస్తూ.. నా బర్త్ డేకి గెస్ట్లు వీళ్లేనంటూ కామెంట్ పెట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇందులో ధోని తన పెంపుడు కుక్కల సమక్షంలో పావు కిలో కేక్ని కట్ చేసి వాటికి తినిపించడం మనం చూడవచ్చు. తర్వాత ధోని కూడా ఒక పీస్ తిన్నాడు. అయితే కుక్కలకు కేక్ ముక్కలను కిందపడకుండా జాగ్రత్తగా గాల్లో విసిరి వేయగా, ధోని పెట్స్ క్యాచ్ చేసి పట్టుకొని తిన్నాయి. ఈ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటుంది.
ధోని షేర్ చేసిన వీడియోకి.. ఆయన భార్య సాక్షి సింగ్, లవ్ సింబల్స్ని పెట్టింది. ఇక భువనేశ్వర్ కుమార్ భార్య నుపుర్ నగర్ ‘ఈ రోజు ఇంటర్నెట్లో ఇదే క్యూటెస్ట్ వీడియో’ అంటూ కామెంట్ సెక్షన్లో రాసుకొచ్చింది. కోలీవుడ్ హీరోయిన్లు ఐశ్వర్యా లక్ష్మీ, రమ్యా పాండియన్ కూడా ధోనీ వీడియోపై ‘తలా’ అంటూ లవ్ ఎమోజీలతో కామెంట్ల వర్షం కురిపించారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా ధోనిపై తమకు నచ్చిన విధంగా ప్రేమని చూపించారు. అయితే ధోని తన బర్త్ డే వేడుకని అతిధులు లేకుండా, హంగు, ఆర్బాటం చేయకుండా ఇలా సింపుల్గా చేసుకోవడం గొప్ప విషయం అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.