Site icon vidhaatha

Nalgonda: తిప్పర్తి మండలం సర్వారం గ్రామంలో.. కత్తిపోట్లతో ఒకరి హత్య

విధాత: నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం సర్వారం గ్రామంలో ఒక వ్యక్తిని అతని ప్రత్యర్థి కత్తితో పొడిచి హత్య చేశాడు. గ్రామంలో అందరూ చూస్తుండగానే నిందితుడు మధు(మసూద్) ఆవేశంతో చిర్రబోయిన శంకర్ యాదవ్ (26)పై కత్తితో దాడి చేశాడు.

కత్తిపోట్లకు గురైన శంకర్ ను ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. వివాహేతర సంబంధం నేపథ్యంలో నెలకొన్న వివాదమే శంకర్ హత్యకు దారి తీసిందని తెలుస్తుంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

Exit mobile version