Nayanthara | జాగ్రత్త అంటూ షారుఖ్ హెచ్చరిక.. నయన్‌పై విఘ్నేష్‌కి ఇప్పుడలా అనిపిస్తుందేంటో..?

Nayanthara విధాత‌: తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ అయిన అట్లీ ఈమధ్య బాలీవుడ్ వైపు అడుగులు వేశాడు. తన మొదటి హిందీ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతారను హీరోయిన్‌గా తీసుకున్నాడు. ఈ జవాన్ మూవీతోనే నయనతార కూడా హిందీ పరిశ్రమలోకి అడుగుపెడుతుండటం విశేషం. అయితే జవాన్ ట్రైలర్ విడుదలై, నెట్టింట కాస్త హడావుడి చేస్తుంది. ఈ సందర్భంగా ట్రైలర్ గురించి విఘ్నేష్ శివన్ జవాన్ టీమ్‌కి విషెశ్ తెలుపుతూ చేసిన పోస్ట్‌కి షారుఖ్ చేసిన […]

  • Publish Date - July 19, 2023 / 11:16 AM IST

Nayanthara

విధాత‌: తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ అయిన అట్లీ ఈమధ్య బాలీవుడ్ వైపు అడుగులు వేశాడు. తన మొదటి హిందీ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతారను హీరోయిన్‌గా తీసుకున్నాడు. ఈ జవాన్ మూవీతోనే నయనతార కూడా హిందీ పరిశ్రమలోకి అడుగుపెడుతుండటం విశేషం. అయితే జవాన్ ట్రైలర్ విడుదలై, నెట్టింట కాస్త హడావుడి చేస్తుంది. ఈ సందర్భంగా ట్రైలర్ గురించి విఘ్నేష్ శివన్ జవాన్ టీమ్‌కి విషెశ్ తెలుపుతూ చేసిన పోస్ట్‌కి షారుఖ్ చేసిన రీ ట్వీట్ వైరల్ అయింది.

‘జవాన్’ ట్రైలర్ బావుంది. ఈ మూవీ టీమ్‌కి నా అభినందనలు. దర్శకుడు అట్లీకి, నా భార్య నయనతార ‘జవాన్’ సినిమాతో హిందీ తెరకు పరిచయం అవుతున్నందుకు గర్వంగా ఉంది. ట్రైలర్ అదిరింది, ఇంటర్నేషనల్‌ లెవల్లో ఉందని ప్రశంసల వర్షం కురిపించాడు. షారుఖ్ హీరోగా నటించిన సినిమాలో, నా భార్య బాలీవుడ్‌కి పరిచయం కావాలని నయన్ కల నెరవేరిందని విఘ్నేష్ ఆనందంగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు.


ఆ ఒక్క పోస్ట్‌తో ఆపకుండా నయన్‌పై వరసగా పొగడ్తల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. అంతకు ముందు ప్రేమలో ఉన్నప్పుడు మేము ఎప్పుడూ ప్రేమలో ఉన్నామని కానీ, పెళ్లి చేసుకుంటున్నామని కానీ చెప్పని విఘ్నేష్.. పెళ్లికి ముందే నయనతారని గర్భవతిని చేసి.. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. సరొగసీ విధానంలో వారు కవల పిల్లలకు జన్మనిచ్చారు. మరి అప్పుడు ఎక్స్‌ప్రెస్ చేయని ప్రేమని ఇప్పుడెందుకు దాచుకోలేకపోతున్నాడో జనాలకైతే అర్థం కావడం లేదు. ఇక విఘ్నేష్ పోస్ట్‌లపై ఫారుఖ్ కూడా కాస్త సరదాగే స్పందించాడు.

‘‘విఘ్నేష్ మా జవాన్ సినిమా గురించి మీరు స్పందించినందుకు థ్యాంక్స్.. అంటూ నయన్ అద్భుతమైన వ్యక్తి, ఈ విషయం మీకు ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. కానీ ఈ సినిమాలో భాగంగా తను కొన్ని పంచులు నేర్చుకుంది. కాబట్టి ఆమెతో కాస్త జాగ్రత్తగా ఉండండి.. అని చిలిపిగా హెచ్చరించాడు. షారుఖ్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ‘పఠాన్’ మూవీ తర్వాత షారుఖ్ చేస్తున్న సినిమా ‘జవాన్’.. దీని మీద అందరూ భారీ అంచనాలతో ఉన్నారు. ఈ మూవీలో నయనతారతో పాటు, విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె, ప్రియమణి కీలక పాత్రల్లో నటించారు. ‘జవాన్’ సెప్టెంబర్ 10న విడుదలకాబోతుంది. ఈ మూవీ షారుఖ్ భార్య గౌరీ ఖాన్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించారు.

Latest News