Road Accident | ఉమ్రా యాత్రకు వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో 20 మంది మృత్యువాత

Road Accident | సౌదీ అరేబియాలోని నైరుతి ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు యెమెన్‌ సరిహద్దులోని నైరుతి అసిర్‌ ప్రావిన్స్‌లో యాత్రికులతో వెళ్తున్న వంతెను ఢీకొట్టి.. మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 20 మంది మరణించగా.. 29 మంది గాయపడ్డారని సౌదీ అరేబియా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది యాత్రికులు, పవిత్ర రంజాన్ మాసంలో ఉమ్రా యాత్ర కోసం మక్కా నగరానికి వెళ్తున్నట్లు పేర్కొంది. అయితే, ఓ […]

  • Publish Date - March 28, 2023 / 04:55 AM IST

Road Accident | సౌదీ అరేబియాలోని నైరుతి ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు యెమెన్‌ సరిహద్దులోని నైరుతి అసిర్‌ ప్రావిన్స్‌లో యాత్రికులతో వెళ్తున్న వంతెను ఢీకొట్టి.. మంటలు చెలరేగాయి.

ఈ ఘటనలో 20 మంది మరణించగా.. 29 మంది గాయపడ్డారని సౌదీ అరేబియా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది యాత్రికులు, పవిత్ర రంజాన్ మాసంలో ఉమ్రా యాత్ర కోసం మక్కా నగరానికి వెళ్తున్నట్లు పేర్కొంది.

అయితే, ఓ కుటుంబం స్నేహితులతో కలిసి వెళ్తున్న సమయంలో బ్రిడ్జిని ఢీకొని బోల్తా పడడంతో బస్సులో మంటలు చెలరేగి.. ఆ తర్వాత బస్సు పూర్తిగా దగ్ధమైంది.

Latest News