Site icon vidhaatha

ట్రైన్ లో 26 మంది అమ్మాయిలు .. డౌట్ వచ్చి చూడగా దిమ్మ తిరిగిపోయింది.

విధాత:గజినీ మూవీ లో ట్రైన్ లో హీరోయిన్ ఆసిన్ పిల్లలను కాపాడినట్లు Muzaffarpur-Bandra Avadh Express లో ఆదర్శ్ అనే యువకుడు 26 మంది అమ్మాయిలను కాపాడాడు. వివరాలలో కెళితే ఆదర్శ్ Muzaffarpur-Bandra Avadh Express కోచ్ లో ప్రయాణిస్తున్నాడు.అదే కోచ్ లో 26 మంది అమ్మాయిలు ఏడుస్తూ కనిపించారు.వాళ్ళను చూసి ఆదర్శ్ కు ఎందుకో అనుమానం వచ్చి.వీళ్ళను ఎవరైనా బలవంతం గా కిడ్నాప్ చేసారెమో అన్ని భోగి లో చుట్టూ చూశాడు.ఎవరికి అనుమానం రాకుండా పెత్తనం చెలాయిస్తున్నా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.

వాళ్ళను చూసిన ఆదర్శ్ వెంటనే రైల్వే మంత్రి కు దయచేసి వీళ్ళను ఆదుకోండని ట్విట్ చేసాడు.ఆ ట్వీట్ తో అప్రమత్తమైన రైల్వే శాఖ హుటాహుటిన పోలీసులకు సమాచారం అందిచారు. ఇద్దరు జవాన్ లు సాధారణ దుస్తులతో ఆ భోగి లోకి వెళ్ళి ఆ ఇద్దరు వ్యక్తులతో మాటలు కలిపి అక్కడ జరుగుతున్న విషయాలను పసిగట్టి పోలీసుల ను రంగంలోకి దింపి అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు .