Site icon vidhaatha

నిరుద్యోగులకు బాసటగా పోరాటం.. పవన్‌

విధాత,అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పేరుతో మోసపోయిన నిరుద్యోగులకు బాసటగా జనసేన పోరాటం చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. 20వ తేదీన జిల్లాల్లో ఎంప్లాయ్మెంట్ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వాలని ఆయన అన్నారు. 30 లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామని వైసీపీ హామీ ఇచ్చిందని, ఆ హామీని నమ్మిన యువత మోసపోయిందని పవన్‌ విమర్శించారు. ఏపీపీఎస్సీ ద్వారా 2.3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆనాడు చెప్పారని పవన్‌ ఆరోపించారు.

Exit mobile version