Site icon vidhaatha

Made in India chip | భారత్‌లో తొలి స్వదేశీ చిప్ – విక్రమ్ 32-బిట్ ప్రాసెసర్

Made in India chip | భారత్ దశాబ్దాలుగా ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగాల్లో వినియోగదారుడిగా మాత్రమే ఉంది. కానీ 2021లో ప్రారంభమైన ఇండియా సెమికండక్టర్ మిషన్ (ISM)తో పరిస్థితి పూర్తిగా మారింది. దేశంలోనే చిప్ డిజైన్, ఫాబ్రికేషన్, అసెంబ్లీ, టెస్టింగ్ యూనిట్లు నిర్మించేందుకు ప్రభుత్వం ₹76,000 కోట్ల ప్రోత్సాహక ప్యాకేజీ ప్రకటించింది. మూడు-నాలుగేళ్లలోనే గుజరాత్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్‌ సహా ఆరు రాష్ట్రాల్లో ₹1.60 లక్షల కోట్ల పెట్టుబడులతో పదికి పైగా ప్రాజెక్టులు వేగంగా సాగుతున్నాయి. ఈ కృషి ఫలితమే తాజాగా ఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2025లో ప్రధాని మోదీకి సమర్పించబడిన తొలి స్వదేశీ చిప్​ విక్రమ్ 32-బిట్ ప్రాసెసర్. ఇది భారత్​ఎలక్ట్రానిక్స్​ ప్రస్థానాన్ని మార్చిన చారిత్రక క్షణం.

సెమికాన్ ఇండియా 2025లో చారిత్రక ఘట్టం

న్యూఢిల్లీ లో జరిగిన సెమికాన్ ఇండియా 2025 సభలో కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి “విక్రమ్ 32-బిట్ ప్రాసెసర్” – భారత్‌లోనే పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపుదిద్దుకున్న తొలి మైక్రోప్రాసెసర్ చిప్‌ను అందజేశారు. అదే సమయంలో మరో నాలుగు ప్రాజెక్టుల టెస్ట్ చిప్‌లను కూడా ప్రధానికి ప్రదర్శించారు.

ISRO శాస్త్రవేత్తల సృష్టి

ISRO సెమికండక్టర్ ల్యాబొరేటరీ (SCL), చండీగఢ్ ఈ చిప్‌ను అభివృద్ధి చేసింది. దీన్ని విక్రమ్3201 పేరుతో పరిచయం చేశారు. ఇది అత్యంత కఠినమైన స్పేస్ లాంచ్ వాహన పరిస్థితుల్లో కూడా పనిచేయగలదు.

సాంకేతిక ప్రత్యేకతలు

భారత్‌లో సెమికాన్ విప్లవం

2021లో ప్రారంభమైన ఇండియా సెమికండక్టర్ మిషన్ (ISM) కేవలం 3.5 ఏళ్లలోనే అబ్బురపరిచే ఫలితాలు ఇచ్చింది.

వ్యూహాత్మక ప్రాధాన్యం

సెమికండక్టర్లు ఆధునిక ప్రపంచానికి వెన్నెముక. ఆరోగ్యం, రవాణా, కమ్యూనికేషన్, రక్షణ, అంతరిక్ష రంగం, కంప్యూటర్​..ఇలా ఒకటేమిటి? సెమీకండక్టర్​ లేని ఉపకరణాన్ని ఊహించలేం.  ప్రపంచమంతటా సెమికండక్టర్ చిప్స్ కీలకపాత్ర పోషిస్తున్నాయి. స్వదేశీ ఉత్పత్తి సామర్థ్యం సాధించడం వల్ల భారత్ ఆర్థిక భద్రత, వ్యూహాత్మక స్వావలంబనలో మరింత బలపడనుంది.

మోదీ–వైష్ణవ్ వ్యాఖ్యలు

ప్రపంచంలోని 20% చిప్ డిజైన్ ఇంజినీర్లు భారత్‌లోనే ఉన్నారు. ఇప్పటికే Intel, Qualcomm, Nvidia, Broadcom, MediaTek వంటి దిగ్గజాలు బెంగళూరు, హైదరాబాద్, నోయిడాలో పెద్ద R&D సెంటర్లను ఏర్పాటు చేశాయి.
“విక్రమ్ 32-బిట్” ప్రారంభం భారత్‌ను చిప్ డిజైన్, మాన్యుఫాక్చరింగ్, సాంకేతిక అభివృద్ధిలో విశ్వకేంద్రంగా నిలపడానికి పునాది వేస్తోంది.

Exit mobile version