విధాత: పెట్రోల్ ధరలపై ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్పై వ్యాట్ను 30 శాతం నుంచి 19.40 శాతానికి తగ్గిస్తు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాట్ తగ్గింపుతో ఢిల్లీలో లీటరు పెట్రోల్పై రూ. 8 తగ్గనుంది కాగా ఈ కొత్త రేట్లు ఈ రోజు అర్ధరాత్రి నుంచే అమలులోకి వస్తాయని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.