ఇక రంజాన్ పర్వదినాన్ని అత్యుత్సాహంగా వేడుకగా జరుపుకుంటారు.సాధారణంగా సౌదీ అరేబియాలో నెలవంక కనిపించిన మరుసటి రోజు భారత్ లో రంజాన్ మాసం ప్రారంభం కావడం ఆనవాయితీగా వస్తుంది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 19 నుంచి ముస్లింలు ఉపవాస దీక్షలు పాటిస్తారని ప్రకటించారు. బుధవారం నెలవంక నిర్ధారణ కమిటీ నెలవంక కనిపించినట్లు ప్రకటించిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా రంజాన్ నెల అధికారికంగా ప్రారంభమవుతుంది.

ఈ రంజాన్ పండుగ వెనుక మానవాళికి మంచి చేసే ఉద్దేశం కూడా ఉంది.ఇది క్రమశిక్షణ, ధార్మిక చింత, దాతృత్వాన్ని ప్రజలకు బోధిస్తుంది. ముస్లింల మత గ్రంథమైన ఖురాన్ ఈ మాసంలోనే ఆవిర్భవించింది అని చెప్పుకుంటారు.

అందుకే ఈ మాసం అత్యంత పవిత్రంగా భావిస్తారు. ముస్లింల పవిత్రమైన గ్రంథం ఖురాన్ ను ఈ మాసంలో అనుసరిస్తారు. సమస్త మానవాళికి మార్గ నిర్దేశంగా ఖురాన్ గ్రంధాన్ని అందించినందుకు కృతజ్ఞతతో ముస్లింలు నెల రోజులు విధిగా ఉపవాసాలు అనుసరిస్తారు. 

ఉదయం సూర్యోదయానికి ముందు నుంచి సాయంత్రం సూర్యాస్తమయం వరకు ఉపవాస దీక్షలు చేస్తారు. ఈ దీక్ష సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా నియమ నిష్ఠలతో ఉంటారు.

ఆశలకు, కోరికలకు కళ్లెం వేసి ఆత్మను పరిశుభ్రం చేసుకుంటారు. రంజాన్ మాసంలో ఓవైపు ఉపవాసాలు,మరోవైపు ఖురాన్ పట్టణంతో మనస్సు, శరీరం ఆత్మ ఇవన్నీ పరిశుద్ధమవుతాయి. ఖురాన్ లో చెప్పిన ప్రకారం ఈ మాసంలో ప్రతిరోజు పాటు ఉపవాసం ఉండాలి.

దీన్ని "రోజా" అని పిలుస్తారు. మనదేశంలో ముస్లిం సోదరులు రాత్రి నిద్రపోయి తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి 'సహారి' చేస్తారు.ఆ తర్వాత రోజంతా ఉపవాసం ఉంటారు. సూర్యాస్తమయం తర్వాత ఇఫ్తార్ విందులో పాల్గొంటారు.

మన జ్ఞానేంద్రియాలు నియంత్రణల ఉంచడం, దీక్షలో ఉన్నప్పుడు అబద్ధాలు ఆడరాదు, చెవులతో చెడు వినరాదు, కళ్ళతో అశ్లీల వంటివి చూడరాదు. మనం చేసే ప్రతి పని సన్మార్గంలో ఉండే విధంగా చూడాలి. నెలరోజుల పాటు ఇలాంటి ఘటోరా నియమ నిష్ఠలు పాటించాలి.

ఈ రంజాన్ మాసంలో చెప్పుకోదగిన మరొక విశేషం ఏమిటంటే 'జాకత్' దానధర్మాలు చేయడం. ఈ మాసంలో జాకత్ చేయాలని ఖురాన్ చెబుతుంది. సంపాదించిన దాంట్లో కొంత పేదలకు దానం చేయాలన్నదే దీని నిర్వచనం

ఇది పేదవాడికి ఆర్థిక హక్కుగా కూడా చెప్తుంటారు. ఇలా ప్రతి ధనికుడు తమ సంపాదనలో కొంత మోతాదులో పేదవాడికి ఇవ్వాలని జకాత్ చెబుతోంది. ఈ రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు పాటించడం ద్వారా శారీరక,మానసిక మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగుతాయి