Site icon vidhaatha

Road Accident | క‌ర్ణాట‌క‌లో ఘోర రోడ్డుప్ర‌మాదం.. 12 మంది వ‌ల‌స కూలీలు మృతి

Road Accident | బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క‌లోని చిక్‌బ‌ళ్లాపూర్ స‌మీపంలో గురువారం తెల్ల‌వారుజామున ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. రోడ్డుపై ఆగి ఉన్న ట్యాంక‌ర్‌ను టాటా సుమో వాహ‌నం ఢీకొట్టింది. దీంతో టాటా సుమోలో ప్ర‌యాణిస్తున్న 12 మంది వ‌ల‌స కూలీలు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.

మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని, క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వ‌ల‌స కూలీల‌ను ఏపీలోని స‌త్య‌సాయి జిల్లా గోరంట్ల మండ‌లానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ద‌స‌రా పండుగ‌కు సొంతూర్ల‌కు వ‌చ్చిన కూలీలు.. తిరిగి బెంగ‌ళూరులోని హోంగ‌సంద్ర‌కు వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Exit mobile version