Gold Rates | పసిడి కొనుగోలుదారులకు శుభవార్త. మొన్నటి వరకు పెరుగుతూ వస్తున్న ధరలు స్వల్పంగా దిగివస్తున్నాయి. సోమవారం మార్కెట్లో నిలకడగా కొనసాగిన ధరలు మంగళవారం బులియన్ మార్కెట్లో పతనమయ్యాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.150 తగ్గి తులం రూ.57,950కి దిగివచ్చింది. 24 క్యారెట్ల గోల్డ్పై రూ.160 పతనమైన తులానికి రూ.63,220కి చేరింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.57,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,220కి చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.57,950 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.63,220కి తగ్గింది. ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.58,100 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,370 చేరింది. ఇక హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.57,950 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.63,220 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
మరో వైపు వెండి ధరలు సైతం తగ్గుముఖం పట్టాయి. కిలోకు రూ.300 తగ్గి కిలోకు రూ.75,200కి చేరింది. హైదరాబాద్లో కిలో వెండి రూ.76,700 ధర పలుకుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.