Gold Rates | బంగారం ధరలు మగువలకు ఊరటనిచ్చాయి. నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు బుధవారం బులియన్ మార్కెట్లో దిగివచ్చాయి. 22 క్యారెట్ల గోల్డ్పై రూ.10 తగ్గి తులానికి రూ.57,340 వద్ద కొనసాగుతున్నది. 24 క్యారెట్ల బంగారంపై రూ.10 తగ్గి తులానికి రూ.62,550 పలుకుతున్నది. వెండి కిలోకు రూ.100 వరకు పతనమైంది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.57,840 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,100కి తగ్గింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.57,340 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.62,550కి చేరింది. ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.57,490 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.62,700కి పతనమైంది.
ఇక హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.57,340 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.62,550 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర సైతం తగ్గింది. కిలోకు రూ.100 వరకు దిగివచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్లో కిలోకు రూ.76,900 వద్ద ట్రేడవుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.