తండ్రైన పంజాబ్ ముఖ్య‌మంత్రి.. ఆడ శిశువు జ‌న్మించిన‌ట్లు ట్వీట్

పంజాబ్ ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్ తండ్రి అయ్యారు. త‌న‌కు ఆడ శిశువు జ‌న్మించిన‌ట్లు ఎక్స్ వేదిక‌గా సీఎం మాన్ వెల్ల‌డించారు. త‌న భార్య డాక్ట‌ర్ గుర్‌ప్రీత్ కౌర్ ఆడ‌పిల్ల‌కు జ‌న్మ‌నిచ్చిన‌ట్లు తెలిపారు.

  • Publish Date - March 28, 2024 / 07:21 AM IST

పంజాబ్ ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్ తండ్రి అయ్యారు. త‌న‌కు ఆడ శిశువు జ‌న్మించిన‌ట్లు ఎక్స్ వేదిక‌గా సీఎం మాన్ వెల్ల‌డించారు. త‌న భార్య డాక్ట‌ర్ గుర్‌ప్రీత్ కౌర్ ఆడ‌పిల్ల‌కు జ‌న్మ‌నిచ్చిన‌ట్లు తెలిపారు. ఆ దేవుడు త‌న‌కు ఆడ‌పిల్ల‌ను బ‌హుమ‌తిగా ఇచ్చాడ‌ని, త‌ల్లీబిడ్డ‌లు ఆరోగ్యంగా ఉన్నార‌ని పేర్కొన్నారు. లుధియానాలోని ఫోర్టిస్ హాస్పిట‌ల్‌లో గుర్‌ప్రీత్ కౌర్‌కు డెలివ‌రీ జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో పంజాబ్ ముఖ్య‌మంత్రికి శుభాకాంక్ష‌లు వెలువెత్తుతున్నాయి.

ఈ ఏడాది జ‌న‌వ‌రి 26వ తేదీన పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ త‌న వ్య‌క్తిగ‌త స‌మ‌చారాన్ని షేర్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. రిప‌బ్లిక్ డే ఈవెంట్‌లో ఈ సంతోష‌క‌ర‌మైన వార్త‌ను పంచుకున్నారు. త‌న భార్య గుర్‌ప్రీత్ కౌర్ ప్రస్తుతం ఏడు నెల‌ల‌ గ‌ర్భిణి.. మార్చిలో డెలివ‌రీ కాబోతుంద‌ని ఆయ‌న నాడు తెలిపారు. ఆ రోజు వీడియో ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

భ‌గ‌వంత్ మాన్ 1973, అక్టోబ‌ర్ 17వ తేదీన జ‌న్మించారు. 2022లో సీఎంగా ఎన్నిక‌య్యారు. పంజాబ్‌లోని ధురి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న గెలుపొందారు. 2019 నుంచి ఆప్ స్టేట్ క‌న్వీన‌ర్‌గా కొన‌సాగారు. 2014 నుంచి 2022 వ‌ర‌కు సంగ్రౌర్ ఎంపీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి లోక్‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హించారు. 2022, జులై నెల‌లో డాక్ట‌ర్ గుర్‌ప్రీత్ కౌర్‌ను భ‌గ‌వంత్ మాన్ వివాహ‌మాడారు. ఇది ఆయ‌న‌కు రెండో పెళ్లి. మొద‌టి భార్య‌కు ఇద్ద‌రు పిల్ల‌లు. 

Latest News