Gold Rates | సద్దుల బతుకమ్మ, దసరా పండుగకు ముందు పసిడి (Gold), వెండి ధరలు (Silver Price) కొనుగోలుదారులకు రిలీఫ్ ఇచ్చాయి. బుధవారం బులియన్ మార్కెట్లో ధరలు పతనమయ్యాయి. 22 క్యారెట్ల గోల్డ్పై రూ.700 తగ్గి.. తులానికి రూ.70,300 తగ్గింది. 24 క్యారెట్ల పసిడిపై రూ.110 పెరిగి తులానికి రూ.77,560కి ఎగిసింది. దేశంలోని వివిధ నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో బంగారం 22 క్యారెట్ల తులానికి రూ.71,100 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.76,690కి దిగివచ్చింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.70,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.76,840కి పతనమైంది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.70,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.76,690కి చేరింది.
హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.70,300 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.76,690 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతితో పాటు మిగతా అన్ని నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధర సైతం భారీగా దిగివచ్చింది. కిలోకు రూ.2వేల వరకు పతనమైంది. దీతో ఢిల్లీ వెండి కిలో ధర రూ.94వేలకు తగ్గింది. ఇక హైదరాబాద్లో కిలో వెండి రూ.లక్షకు చేరింది. బంగారం, వెండి ధరలు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. ఆయా రాష్ట్రాల్లోని పన్నుల ఆధారంగా ధర మారుతూ వస్తుంది. మరో వైపు ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.