Gold Rates | కొనుగోలుదారులకు బంగారం ధరలు ఊరటనిస్తున్నాయి. రెండురోజుల పాటు వరుసగా దిగివచ్చిన ధరలు గురువారం బులియన్ మార్కెట్లో నిలకడగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం రూ.63,500 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ తులానికి రూ.69,270 వద్ద స్థిరంగా ఉన్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో పసిడి 22 క్యారెట్ల తులానికి రూ.63,500 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.69,270 పలుకుతున్నది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.63,650 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.69,420కి వద్ద కొనసాగుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.63,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.69,270కి చేరింది.
ఇక హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.63,500 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.69,270 వద్ద నిలకడగా ఉన్నది. ఏపీలోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి సైతం భారీగా దిగివచ్చింది. రోజుకు కిలోకు రూ.500 వరకు పతనమైంది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో కిలోకు రూ.81,500 తగ్గింది. హైదరాబాద్లో కిలోకు రూ.86,500కు చేరింది. ఇదిలా ఉండగా.. బంగారం, వెండి ధరలు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. ఆయా రాష్ట్రాల్లోని పన్నుల ఆధారంగా ధర మారుతూ వస్తుంది. మరో వైపు ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.